ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 25, 2024
ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన డా. జి.లక్ష్మీశ సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువచేసి పారదర్శకమైన సేవలు అందించి, జిల్లా సమగ్రాభివృద్ధికి కృషిచేయాలని సూచిస్తూ కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు.