ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
ముందుగా గొల్లపూడిలో అన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఘననివాళులు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 12.06.2024.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు బుధవారం ఉదయం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ముందుగా గొల్లపూడిలో దివంగత నేత అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.