భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్
మాఫియా రాజ్యానికి చరమగీతం పాడాలి.పాతూరి నాగభూషణం
శ్యాంపిట్రోడా.కాంగ్రెస్ భావజాలాన్ని వెల్లడిస్తున్నారు.. సుధీష్ రాంబొట్ల
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని సభలు విజయవంతం.. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ తధ్యం బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు
బిజెపి నేతల ఉధ్ఘాటన
విజయవాడ… మాఫియా రాజ్యానికి చరమగీతం పాడడానికి రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు దీనికి ఉద్యోగవర్గాలు పోస్టల్ బ్యాలెట్ తీరే ఇందుకు సంకేతంగా కనపడుతోందని బిజెపి నేతలు నొక్కి వక్కాణించారు.
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బిజెపి మీడియా ఇంచార్జి పాతూరి నాగభూషణం తో పాటు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు, బిజెపి సీనియర్ నేత సుధీష్ రాంబొట్ల మాట్లాడారు.
తొలుత బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రధాని సభలు విజయవంతం అయ్యాయి అంతే కాదు విజయావడ నగరం లో నిర్వహించిన రోడ్ షోలో ప్రజలు స్వచ్చందంగా లక్షలాదిగా తరలి వచ్చారు .. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రోడ్ షోలొ వేలాదిగా యువత పాల్గొన్నారు విశ్వవిజేతగా ప్రధానిని కీర్తించారు. ఇదే సంకేతం రాష్ట్రంలో వైసీపి ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు.కేంద్రమంత్రలు పర్యటనలకు రాష్ట్రప్రజలు నీరాజనాలు పట్టారు.
మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ విజయవాడలో జరిగిన రోడ్ షోకు ఎనిమిది కిలో మీటర్ల మేర జనంసంద్రంగా మారిపోయింది ప్రధాని రాక కోసం దాదాపుగా నాలుగు గంటలకు పైగా ప్రజలు వేచి చూసారు అంటే ప్రజలు ఎన్డీఎని గెలిపించడానికి సిద్దంగా ఉన్నారన్నది అర్ధం అవుతుంది. జగన్ పోవాలి ఎన్డీఎ రావాలి అని ప్రజలు నినదిస్తున్నారు. ఇందుకు పోస్టల్ బ్యాలెట్ లో ఉధ్యోగులు పాల్గోన్న తీరే నిదర్శనం అన్నారు. వైసీపికి కౌంట్ డౌన్ ప్రారంభం అయింది, ప్రభుత్వం మారుతుందని అధికారు లు ఫైల్స్ మాయం చేసే పనులు చేయవద్దని నాగభూషణం హితవు పలికారు. మాఫియా అంటే దావుద్ అనుకుంటారు అయితే ఇక్కడ వైసీపి అన్ని రంగాలను అంతకంటే మాఫియాగా మార్చివేసింది.
బిజెపి సీనియర్ నేత సుధీష్ రాంబొట్ల మాట్లాడుతూ సత్యనారాయణగంగాధర్ పిట్రోడా ఎలియాస్ శ్యాంపిట్రోడా చేస్తున్న వ్యాఖ్యలను సోనియా, రాహుల్ , ప్రియాంక లు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. దేశంలో వర్గ విభేదాలు స్రుష్టించి దేశాన్ని ముక్కలు చేయాలన్న కాంగ్రెస్ భావజాలం తాలూకూ వ్యాఖ్యలనే శ్యాంపిట్రోడా వెల్లవేస్తున్నారన్నారు. ఆనాడు అంబేద్కర్ విషయంలో కూడా నెహ్రూ వైఖరి ఈ విధంగా సాగిన సంఘటనలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంభేద్కర్ ని అంబేద్కర్ పిఎ తో ఎన్నికల్లో ఓడించిన కాంగ్రెస్ ఆనాటి నుండి దేశ ప్రజల పై విషంకక్కుతూనే ఉంది. మద్యతరగతి ప్రజలు అంటే కాంగ్రెస్ పార్టీకి ఏవగింపన్న విషయం కాంగ్రెస్ మ్యాని ఫెస్టో చూస్తే అర్ధం అవుతుంది. శ్యాం పిట్రోడా ఒక చింపాజీ అయితే కాంగ్రెస్ ఒక ఇటాలియన్ గా రాంబొట్ల అభివర్ణించారు.