Home Andhra Pradesh మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 102 వ జయంతి వేడుకలు సభ్యులు, ప్రభుత్వ విప్, సెంట్రల్...

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 102 వ జయంతి వేడుకలు సభ్యులు, ప్రభుత్వ విప్, సెంట్రల్ శాసన సభ్యులు బొండా ఉమా

3
0

28/05/2025 బుధవారం ఉదయం 11 గంటలకు.. విజయవాడ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, చరిత్ర కారుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 102 వ జయంతి వేడుకలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్, సెంట్రల్ శాసన సభ్యులు బొండా ఉమా మహేశ్వర రావు పిలుపు మేరకు సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో..ఘనంగా పండుగ వాతావరణంలో నాయకులు, కార్యకర్తలు నడుమ నిర్వహించడం జరిగింది…ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, కేకు కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు మిఠాయిలు పంచి, పేదలకు ఫ్రూట్స్, మజ్జిగ పంపిణీ చేయటం జరిగింది..ఈ సందర్బంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గం కో ఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ…సామాన్య కుటుంబం లో పుట్టి, సామాన్య వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించిన నందమూరి తారకరామారావు చరిత్ర కారుడు గా ప్రజల హృదయాల్లో చిరస్మరనీయుడుగా నిలిచి చరిత్ర పుటల్లోకెక్కి యువతరానికి మార్గదర్శిగా నిలిచారని అన్నారు..చరిత్ర పుటల్లో లిఖించే విధంగా ప్రాంతీయ పార్టీని స్థాపించి కేవలం 9 మాసాల కాలంలోనే అధికారం లోకి తీసుకోచ్చి సంస్కరణలకు నాంది పలికిన మహనీయుడు అని, మహిళలకు ఆస్తి లో సగభాగం, 2 రూపాయలకు కిలో బియ్యం లాంటి అనేక పధకాలను ప్రవేశపెట్టి ప్రాంతీయ పార్టీ అధినేతగా భారత దేశ రాజకీయాలను శాసిస్తూ నేషనల్ ఫ్రంట్ కు చైర్మన్ గా వ్యవహారిస్తూ దేశ ప్రధానిని, దేశ రాష్ట్రపతి ని నిర్ణయించటం లో ప్రధాన భూమిక పోషించి తెలుగువాడి కీర్తిని దేశ వ్యాప్తం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు…ఎన్టీఆర్ లక్ష్యాలను, ధ్యేయాలను నలుదిశాల వ్యాప్తి చేస్తూ నేటి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 43 వసంతాల తెలుగుదేశం పార్టీని జాతీయ హోదాలో నిలిపారని, యువనాయకుడు కార్యకర్తలకు అపద్భాందవుడు నారా లోకేష్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని, ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని తెలిపారు..ఈ కార్యక్రమంలో నాయకులు బెజ్జం జయపాల్, దాసరి ఉదయ్ , వేల్పుల రాజేష్, దాసరి దుర్గారావు, కొమ్మినేని సురేష్, కరణం రమణ, పైడి శ్రీను, కొడాలి వంశీ, జాన్ వలి, వెలగ సురేష్, జలకం రాజా, లక్కం శెట్టి శ్రీనివాస్, కోలా దుర్గారావు, వేంపాటి రమణ, బెవర సూరి, నాగ రాజు, రహీం, Ch రఘు, SK గౌసియా,SD గౌసియా, తిరుపతి గౌడ్, సరోజ, సుల్తానా, నాగరత్నం, లీలావతి, నాగ లక్ష్మీ, ఝాన్సీ, సాయి, హరిమ్మ, పాల రజిని, విజయలక్ష్మి, కొండపల్లి రూప్ కుమార్, మంటాడ శివ, అన్వర్, బాజీ, తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here