Home Andhra Pradesh మాజీ ముఖ్మమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం కిలో రెండు రూపాయలకే బియ్యం పథకం ఎన్టీఆర్...

మాజీ ముఖ్మమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం కిలో రెండు రూపాయలకే బియ్యం పథకం ఎన్టీఆర్ ఘనతే

4
0

విజయవాడ, తేదీ: 28.05.2025 మాజీ ముఖ్మమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం కిలో రెండు రూపాయలకే బియ్యం పథకం ఎన్టీఆర్ ఘనతే సామాన్యుడిగా పుట్టి ఎంతోమందికి ఎన్టీఆర్ ఆదర్శం కాపులకు అన్నివిధాలా రుణాలు అందిస్తా పేద వాడికి న్యాయం అందించేందుకు ఎన్టీఆర్ నిరంతరం కృషి చేశారు కొత్తపల్లి సుబ్బారాయుడు, చైర్మన్, ఏపీ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ సామాన్య కుటుంబంలో పుట్టి ఎంతో ఎత్తుకు ఎదిగిన మాజీ ముఖ్మమంత్రి స్వర్గీయ ఎన్.టీ.రామారావు నేడు ఎంతో మందికి ఆదర్శప్రాయుడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. మాజీ ముఖ్మమంత్రి స్వర్గీయ ఎన్.టీ.రామారావు జయంతి సందర్భంగా బుధవారం కాపు కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ దేశ, విదేశాల్లో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. పేదవర్గాలకు అండగా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్మమంత్రి స్వర్గీయ ఎన్.టీ.రామారావుకు దక్కుతుందన్నారు. ఆయన పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారన్నారు. ఎన్.టీ.రామారావు ముఖ్యమంత్రి అయ్యాకే ప్రజాప్రతినిధులు గురించి అందరికీ తెలిసిందన్నారు. కిలో రెండు రూపాయలు, ఆడపిల్లకు ఆస్తి హక్కు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చి, రాష్ట్రంలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఎంతోమంది యువతకు రాజకీయ అవకాశాలు కల్పించారన్నారు. సినీ, రాజకీయాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్వక్తి మాజీ ముఖ్మమంత్రి స్వర్గీయ ఎన్.టీ.రామారావు అని అన్నారు. ఆయనతో పనిచేయడం ఎంతో గర్వకారణం అన్నారు. సినిమాల్లో శ్రీకృష్ణుడిగా, వెంకటేశ్వరస్వామిగా, ఆయన చేసిన పౌరాణిక, సాంఘిక సినిమాలు ఎంతోమందికి ఆదర్శమన్నారు. మేమంతా ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామన్నారు. ఆయన బాటలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు పయనిస్తున్నారన్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ ఆశయాల అమలుకు ముందుకు సాగుతోందన్నారు. కాపు కార్పొరేషన్ 2014 కు ముందు లేదని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాకే 2015 సంవత్సరంలో ఏర్పాటు చేశారన్నారు. కాపులను సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా తీసుకొచ్చే లక్ష్యంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ భరోసా, చంద్రన్న విదేశీ విద్యా దీవెన, దీపం, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ లు అందిస్తున్నామన్నారు.. కాపు కార్పొరేషన్ రిజల్ట్ ఓరియెంటెడ్ గా పని చేస్తుందని, ఒక్క ఏడాది లోగానే ఆ ఫలితాలను చూపిస్తామన్నారు. స్వయం ఉపాధి పథకాలు కోసం అర్హులైన కాపులు అందరికీ రుణాలు ఇప్పిస్తామన్నారు. ప్రభుత్వం కాపు కార్పొరేషన్ కింద అన్నీ కలుపుకొని రూ. 4,600 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. కాపు భవనాలు 4 చోట్ల తప్ప మిగిలిన చోట కాన్సిల్ చేశారని, రివ్యూ చేసి కాన్సిల్ చేసిన వాటిని పునరుద్ధరిస్తామన్నారు. గృహిణి అనే ఒక కొత్త స్కీమ్ కూడా తేవాలని ప్రభుత్వం యోచిస్తుందని, ఆ పథకం కింద మొత్తం కార్పొరేషన్ ద్వారా మహిళలకు ఆర్థికంగా చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునేలా చేయూత అందిస్తామన్నారు. కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వడంలో ఇబ్బందులు ఉండవని, కూటమి ప్రభుత్వంపై బ్యాంకర్లకు ఎంతో నమ్మకం ఉందన్నారు. అనంతరం మాజీ ముఖ్మమంత్రి స్వర్గీయ ఎన్.టీ.రామారావు జయంతి సందర్బంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ కేకు కట్ చేసి, నివాళులు అర్పించారు..కార్యక్రమంలో కాపు కార్పొరేష్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. కృష్ణమూర్తి, ఉద్యోగులు, తదితరలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here