ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ తేదీ.07-03-2025
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ పరిపాలనా విభాగ మహిళా సిబ్బందిని సత్కరించిన అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా ఈ రోజు ది.07.03.2025 వ తేదీన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్ ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయంలోని విదులు నిర్వహించు పరిపాలనా విభాగ మహిళా సిబ్బందిని చీరను బహుమతిగా అందిస్తూ సత్కరించి అభినంధనలు తెలిపినారు.
ఈ సందర్భంగా అడ్మిన్ డి.సి.పి. మాట్లాడుతూ అందరికీ అంతర్జాతీయ “మహిళా దినోత్సవ శుభాకాంక్షలు” తెలియజేశారు. ప్రస్తుత సమాజంలో మహిళలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని, పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, విద్య, ఉద్యోగం, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం రోజురోజుకు పెరుగుతుందని, కుటుంబ ఆర్ధిక బారాన్ని సైతం స్త్రీ శక్తి మోస్తుందని, స్త్రీలు ఉన్నత శిఖరాలను చేరుకుని పురుషులతో తామేమీ తీసిపోమని చాటిచెబుతూ, ఎన్నెన్నో అధ్బుతాలు సాధించడం స్త్రీ శక్తికి ఇది గర్వకారణం అని, సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని కుటుంబం పట్ల అత్యంత శ్రద్ధగా బాధ్యతగా మెలిగేది స్త్రీయే అని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన నగర పోలీసు కమిషనర్ కి ధన్యవాధాలు తెలిపినారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్,ఏ.ఓ. సునితా పరిపాలనా విభాగ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంగాధర్ అసోసియేషన్ సంఘ సభ్యులు జి శేషారత్నం జి .కళ్యాణి ఏవీఎన్ఎస్ కళ్యాణి ఆనంద్ నగేష్ పెరుమాళ్ బుచ్చయ్య ఫ్రాన్సిస్ శ్రీనివాస్ మరియు పరిపాలనా విభాగ సిబ్బంది పాల్గొన్నారు.