Home public news మహిళా ఉద్యోగులలో మనోధైర్యం మానసిక వికాసం అవసరం మహిళా దినోత్సవాన్ని...

మహిళా ఉద్యోగులలో మనోధైర్యం మానసిక వికాసం అవసరం మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి

2
0

 


మహిళా ఉద్యోగులలో మనోధైర్యం 

మానసిక వికాసం అవసరం 

మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి.

మహిళా ఉద్యోగులకు సాంస్కృతిక ఆటల పోటీలు 

 ఏపీ ఎన్జిజీవో మహిళా విభాగం చైర్ పర్సన్ వి.నిర్మల కుమారి 

ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి కలిగిన మహిళల గౌరవాన్ని కాపాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ను ఏపీ ఎన్జీజీవో మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆహ్లాదకరంగా నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జిజీవో మహిళా విభాగం రాష్ట్ర చైర్ పర్సన్ వి. నిర్మలా కుమారి తెలిపారు. గాంధీనగర్ లోని ఎన్జిజిఓ హోంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ నిర్వహణ వివరాలతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వేదికగా రవాణా మరియు క్రీడా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 1.00 నుంచి 7 గంటల వరకు టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, షటిల్ (డబల్స్), అంత్యక్షరి పోటీలు జరుగుతాయన్నారు. ఏపీ ఎన్జీజీఓ హోం వేదికగా 5వ తేదీన చెస్, క్యారమ్స్ ( డబల్స్), తెలుగులో వ్యాసరచన, ఒక్క నిమిషం పాటు ఎటువంటి ఆంగ్ల పదాలు వాడకుండా తెలుగులో ప్రసంగించే పోటీలలో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. 6వ తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు సినీ, జానపద, లలిత తల పోటీలు, నృత్య పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు 8వ తేదీన గాంధీనగర్ లోని ఎన్జీజీవో హోం లో జరిగే బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రి, 

ఎస్. సవిత, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ విభాగం కమిషనర్ రేఖా రాణి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని వివరించారు. మహిళా విభాగం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి అలపర్తి విద్యాసాగర్ అన్ని విధాలుగా సహకరిస్తున్నారని వారికి ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ పి. మాధవి మాట్లాడుతూ మహిళల హక్కులను రక్షించేందుకు, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు, అలాగే వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం 1909లో అమెరికాలో మొదటిసారి నిర్వహించారన్నారు.1910లో, డెన్మార్క్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో జర్మనీకి చెందిన క్లారా జెట్‌కిన్ అనే మహిళా హక్కుల పోరాట నాయకురాలు మార్చి 8ను అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించాలని ప్రతిపాదించారని గుర్తు చేశారు. మహిళలు కుటుంబ నిర్వహణతో పాటు, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. గతంలో మహిళలు కేవలం ఇంటికే పరిమితమై ఉండేవారని అయితే ఆధునిక యుగంలో వారు విద్య, వైద్యం, రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు, శాస్త్ర & సాంకేతిక రంగాలలో విశేషమైన కృషి చేస్తున్నారన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వంలోని విభాగాలలో పనిచేస్తున్న మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

“మహిళలందరూ బలవంతులే, ప్రపంచాన్ని మారుస్తారు!” అనే సిద్ధాంతాన్ని నమ్మిన ప్రతి ఒక్కరు ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

    సమావేశంలో ఏఐఎస్ జి ఈ ఎఫ్ మహిళా కమిటీ కన్వీనర్ ఎం. రాజలక్ష్మి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బి. జానకి, రాష్ట్ర కార్యదర్శి బి. తులసి రత్నం, రాష్ట్ర మహిళా విభాగం నాయకులు లలితాంబ, శాంతిశ్రీ, శివలీల, విజయ , మల్లీశ్వరి, సురేఖ, సరస్వతి తదితరులతోపాటు క్యాపిటల్ సిటీ బ్రాంచ్ అమరావతి మహిళా నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here