Home public news మ‌హిళల శ‌క్తి అనంతం మ‌హిళా ఉద్యోగులంద‌రూ స్వ‌ర్ణాంధ్ర 2047 సాధ‌న దిశ‌గా కృషి చేయాలి

మ‌హిళల శ‌క్తి అనంతం మ‌హిళా ఉద్యోగులంద‌రూ స్వ‌ర్ణాంధ్ర 2047 సాధ‌న దిశ‌గా కృషి చేయాలి

2
0

08-03-2025

మ‌హిళల శ‌క్తి అనంతం మ‌హిళా ఉద్యోగులంద‌రూ స్వ‌ర్ణాంధ్ర 2047 సాధ‌న దిశ‌గా కృషి చేయాలి

ఎపిఎన్జీజివోస్ అసోసియేష‌న్ (రాష్ట్ర మహిళ విభాగం) ఆధ్వ‌ర్యంలో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు

ముఖ్యఅతిథిగా హాజ‌రైన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ

విజ‌య‌వాడ‌: మ‌హిళలు చాలా శ‌క్తివంతులు వారి శ‌క్తి అనంతం, అనుకుంటే ఏమైనా సాధించ‌గ‌ల‌రు. మ‌హిళ ప‌క్ష‌పాతి అయిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విజ‌న్ స్వ‌ర్ణాంధ్ర ప్ర‌దేశ్ 2047 సాధ‌న దిశ‌గా మ‌హిళా ఉద్యోగులు కృషి చేయాల‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ అన్నారు. అంత‌ర్జాతీయ మ‌హిళ దినోత్స‌వం సంద‌ర్భంగా గాంధీన‌గ‌ర్ లోని ఎపిఎన్జీజివోస్ అసోసియేష‌న్ (రాష్ట్ర మహిళ విభాగం) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన మ‌హిళాదినోత్స‌వ వేడుక‌ల‌కి ముఖ్యఅతిథిగా కేశినేని జాన‌కి ల‌క్ష్మీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించిన క్రీడాల్లో విజేత‌ల‌కు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తో క‌లిసి బ‌హుమ‌తులు అంద‌జేశారు.

అనంత‌రం కేశినేని జాన‌కి ల‌క్ష్మీ మాట్లాడుతూ ఉద్యోగాలు చేసే మ‌హిళ‌లు లింగ వివ‌క్ష‌కి గురైన‌ప్పుడు మాన‌సికంగా కృంగిపోకుండా ఆత్మ‌సైర్థ్యంతో నిల‌బ‌డి పోరాడాల‌న్నారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా సాటి మ‌హిళ తోడుగా నిలుస్తాన‌ని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎపిఎన్జీజివోస్ అసోసియేష‌న్ (రాష్ట్ర మహిళ విభాగం) అధ్య‌క్షురాలు నిర్మ‌ల కుమారి, ఐపిఎస్ ఆఫీస‌ర్ షేక్ ష‌రీనా బేగం, ఎన్టీఆర్ జిల్లా తెలుగు మ‌హిళా అధ్య‌క్షురాలు చెన్నుపాటి ఉషారాణి, ఎపిఎన్జీజివోస్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షుడు కె.శివ‌రెడ్డి, ఎపిఎన్జీజివోస్ అసోసియేష‌న్ రాష్ట్ర జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ విద్యాసాగ‌ర్ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here