మల్లెతీగ డైరీ 2025 ఆవిష్కరణ
భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలో శనివారం నవ మల్లెతీగ సకుటుంబ సాహిత్య మాసపత్రిక 2025 నూతన సంవత్సర డైరీను ఆవిష్కరించారు.
నవ్యాంధ్ర రచయితల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ,రచయిత యేమినేని వెంకటరమణ ఆధ్వర్యంలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా నిలుస్తూ… నిరంతరం ప్రజలకు సమాచారం చేరవేస్తున్న విలేకరుల కృషి అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు వెంట్ర ప్రగడ ఫణి కుమార్, తిరుమల శెట్టి నాగేశ్వరరావు, హరి ప్రసాద్ రెడ్డి కూటమినేతలు దాడి అప్పారావు, ముదిగొండ శివ తదితరులు పాల్గొన్నారు.