విజయవాడ నగర పాలక సంస్థ 06-06-2025*మలేరియా మాసోత్సవాల పోస్టర్ లాంచ్**విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర* విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలో గల తన చాంబర్లో మలేరియా మాసోత్సవాలు పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలం దృశ్య, నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో దోమలు ఉత్పత్తి చెందే అవకాశం ఉన్నందున, ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు మలేరియా మాసోత్సవాల్లో భాగంగా ప్రజలకు పోస్టర్ల, కరపత్రాల ద్వారా ప్రతి సచివాలయంలో అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఫ్రైడే- డ్రై డే గా పాటించాలని, నీటి నిల్వలు పరిసర ప్రాంతాల్లో లేకుండా చూసుకునేటట్టు చర్యలు తీసుకుని, పూల కుండీలు, రెఫ్రిజిరేటర్ లోని నిల్వ ఉన్న నీరు, టైర్లు, కాళీ తొట్లు, రుబ్బు రోళ్ళు, పాడైపోయిన బక్కెట్లు, క్రమ తప్పకుండా ప్రతి ఫ్రైడే ఖాళీ చేసుకుని తమ వంతు బాధ్యతను ప్రజలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, బయాలజిస్ట్ సూర్యకుమార్, సానిటరీ సూపర్వైజర్లు శివరామకృష్ణ, సలీం, సోమరాజు, రమేష్ పాల్గొన్నారు.