మర్డర్ చేసినవారికి ఇచ్చే ట్రీట్మెంట్ జానీమాస్టర్కు ఇవ్వాలి
ఎమ్మెల్యే రాజా సింగ్
జానీ మాస్టర్ వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. జానీ మాస్టర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. మర్డర్ చేసిన వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయో.. జానీ మాస్టర్కు అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నారు. జానీ మాస్టర్ కేసులో పోలీసులు కఠినంగా ఉండాలన్నారు. జానీ మాస్టర్ సినీ పరిశ్రమకు మచ్చ తెచ్చారని.. సినీ పరిశ్రమ నుంచి జానీ మాస్టర్ను బహిష్కరించాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. జాని మాస్టర్ ది లవ్ జిహాదీ అన్నారు. ఆయన ఇంకా ఎంత మంది అమ్మాయిల ను మతం మారాలని ఒత్తిడి చేశారో విచారణ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇలాంటివి చేసిన వారినీ కఠినంగా శిక్షించాలని కోరారు.