ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ.ది.19.05.2025
మరణించిన హోంగార్డుల కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజ శేఖర బాబు
ఐ.పి.ఎస్.
విజయవాడ నగరంలో పనిచేస్తున్న హోంగార్డులలో ఎవరైనా మరణించిన లేక పదవీ విరమణ చేసిన వారు ఆర్ధికంగా ఇబ్బందులు పడకుండా చేయడానికి నగరంలో పనిచేస్తున్న హోంగార్డులు అందరూ స్వచ్ఛందంగా వారికి వచ్చే వేతనం నుండి సదరు చనిపోయిన హోంగార్డు కుటుంబాలకు లేదా పదవీ విరమణ చేసిన హోంగార్డులకు ఆర్థిక ఆసరా కల్పిస్తున్న విషయం విదితమే
ఈ సందర్భంగా హోంగార్డ్ (హెచ్.జి. నెం 535) పి.శ్రీమన్నారాయణ (45 సం.) విజయవాడ నగర హోంగార్డు యూనిట్ నందు విధులు నిర్వహిస్తూ బ్రైన్ స్టోక్ తో మరణించినారు. మరణించిన హోంగార్డు శ్రీమన్నారాయణ కుటుంబానికి ఆర్ధిక సహాయంగా రూ. 5 లక్షల నగదు చెక్కును ఈ రోజు ది.19.05.2025వ తేదీన పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ చేతులమీదుగా శ్రీమన్నారాయణ భార్య పి.నరసమ్మ కి అందజేయటమైనది.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ డి. సి. పి. కె. జి. వి. సరిత ఐ. పి. ఎస్ , హోంగార్డు ఆర్.ఐ. కె.సుధాకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.