మద్యం సేవించి వాహనాలు నడిపిన 20 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు

6
0

 *ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ *తేదీ. 05-02-2025.*

మద్యం సేవించి వాహనాలు నడిపిన 20 మంది వ్యక్తులకు జరిమానా విధించిన న్యాయస్థానం వారు

విజయవాడ నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. వారి అదేశాల మేరకు నగరంలో వివిధ ప్రదేశాలలో మద్యం సేవించి వాహనములు నడిపే చోదకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగినది. 

ఈ నేపధ్యంలో ది.05-02-2025 వ తేదిన 2వ మరియు 4వ ట్రాఫిక్ పోలీసు వారు మొత్తం 20  కేసులలో మద్యం సేవించి వాహనములు నడిపే చోదకులను సంబంధిత కోర్ట్ లో ప్రవేశపెట్టగా,   న్యాయమూర్తి   లెనిన్ బాబు మొత్తం 20 మందిలో 03 మందికి ఒక్కొక్కరికి రూ.15,000/-  చొప్పున మిగిలిన 17 మందికి 

ఒక్కొక్కరికి రూ.10,000/-  చొప్పున  జరిమానా విధించడం జరిగింది.

 ప్రతి రోజు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించి పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి వాహన చోదకులు ట్రాఫిక్ నియమ నిబంధనలు, మోటార్ వాహన చట్టాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. తెలియజేయటం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here