Home Political news మద్యం పాత బ్రాండ్లకు స్వాగతం గత ప్రభుత్వం మద్యం ఆదాయం కోసం అడ్డదారులు తొక్కింది...

మద్యం పాత బ్రాండ్లకు స్వాగతం గత ప్రభుత్వం మద్యం ఆదాయం కోసం అడ్డదారులు తొక్కింది మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ

3
0

 అమరావతి

07.08.2024

మద్యం పాత బ్రాండ్లకు స్వాగతం

గత ప్రభుత్వం మద్యం ఆదాయం కోసం అడ్డదారులు తొక్కింది

పాత బ్రాండ్లను తొక్కిపెట్టి కమిషన్ల కోసం కల్తీ మద్యం అమ్మింది

2019కి ముందున్న బ్రాండ్లను ఏపీలో అందుబాటులోకి తెస్తాం

ఉత్పత్తికి ముందుకొచ్చే కంపెనీలకు ప్రోత్సాహం అందిస్తాం

మద్యం ఎంఎన్‌సీ ప్రతినిధులతో సమావేశంలో గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

ప్రజల ప్రాణాలు హరిస్తున్న కల్తీ మద్యం బ్రాండ్ల నుండి విముక్తి కలిగించేలా త్వరలోనే మెరుగైన పాలసీతో ముందుకు వస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సచివాలయంలో మద్యం తయారీ ఎంఎన్‌సీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. 2014-19 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని కేవలం ప్రైవేటు వ్యాపారంగా మాత్రమే భావించింది. దేశం మొత్తం లభించే బ్రాండ్లను ఏపీలో కూడా అందుబాటులో ఉంచింది. కానీ, 2019లో ప్రభుత్వం మారిన తర్వాత  మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ప్రజల ప్రాణాలు హరించాడు. అమ్మకాలకు, కొనుగోళ్లకు సంబంధమే లేకుండా ఆదాయం మొత్తాన్ని దారి మళ్లించారు. దేశమంతా డిజిటల్ పేమెంట్ల వైపు వెళ్తుంటే ఏపీలో మాత్రం క్యాష్ అండ్ క్యారీ విధానంలో మద్యం అమ్మకాలతో వేల కోట్లు లూటీ చేశారు. కల్తీ మద్యం తీసుకొచ్చి వేలాది మంది మరణాలకు, అనారోగ్యానికి కారమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ రెడ్డి చేసిన మద్యం అక్రమాలను త్వరలోనే బయటపెడతామం. అక్టోబర్ 1 నాటికి నతన మద్యం పాలసీని అందుబాటులోకి తీసుకొస్తాం. నాణ్యమైన మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొస్తాం. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించేలా ముందుకొచ్చే కంపెనీలకు తోడుగా ఉంటాం. నాణ్యమైన మద్యం బ్రాండ్లను ఏపీకి తీసుకొచ్చేందుకు ముందుకు వచ్చిన కంపెనీ ప్రతినిధులకు ప్రభుత్వ పరంగా కావాల్సిన తోడ్పాటు అందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here