Home public news మత్స్యకారులకు అండగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే సుజనా చౌదరి

మత్స్యకారులకు అండగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే సుజనా చౌదరి

3
0

 మత్స్యకారులకు అండగా కూటమి ప్రభుత్వం

ఎమ్మెల్యే సుజనా చౌదరి

మత్స్య సంపదను పెంపొందించి   మత్స్యకారుల ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని  పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు యలమంచిలి సత్యనారాయణ  

   (సుజన చౌదరి ) అన్నారు.

మత్స్యశాఖ ఆధ్వర్యంలో భవానిపురం లోని భవాని ఘాటు వద్ద జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ తో కలిసి కృష్ణా నదిలో చేప పిల్లలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ  మత్స్యకారుల సంక్షేమంతో పాటు మత్స్య సంపదను పెంచడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా కృష్ణానది లో  7 లక్షల 50 వేల చేప పిల్లలను విడుదల చేయటం జరుగుతుందని ఏడు నెలల అనంతరం మత్స్యకారులు వాటిని వేటాడి  విక్రయించుకొని ఆర్థిక ప్రయోజనం పొందాలన్నదే  కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పధకం ద్వారా  సబ్సిడీ పై అనేక పథకాలను అందజేస్తున్నాయని వాటిని ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే సుజనా  కోరారు.కలెక్టర్ లక్ష్మిశ మాట్లాడుతూ

వేటకు వెళ్లే మత్స్యకారులకు లైసెన్స్ లు మంజూరుచేయడం జరుగుతుందని 50 సంవత్సరాలు పైబడిన మత్స్యకారులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు  తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు  ఆర్ధిక సహాయం అందజేస్తున్నట్లు  తెలిపారు. కృష్ణా నదిలో  7.50 లక్షల రాగండి రకం చేపల పిల్లలను విడుదల చేయడం జరుగుతుందని ఏడు నెలల అనంతరం అవి సుమారు 5.25 లక్షల కేజీలుగా ఎదుగుతాయన్నారు. ఒక కేజీ చేప ఖరీదు 100 రూపాయల చొప్పున మత్స్యకారులకు సుమారు 525 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతుందన్నారు. మత్స్యకారుల ఆర్ధిక ప్రయోజనంతో పాటు వినియోగదారులకు తక్కువ ధరకే మత్స్య ఉత్పత్తులు అందుబాటుధరకు దొరికే అవకాశం ఉంటుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు తెలిపారు. 

 

కార్యక్రమంలో మత్స్యశాఖ కమీషనర్ టి. డోలా శంకర్, జిల్లా మత్స్య శాఖ అధికారిణి సిహెచ్ ఎస్. చక్రాణీ, డెవలప్ మెంట్ ఆఫీసర్ పి. అఖిల, విఫ్ఏ. ఎలియా రామారావు, స్థానిక నాయకులు బొమ్మసాని సుబ్బారావు, తహశీల్ధార్ ఇంతియాజ్ పాషా, కార్పొరేటర్ రెహమ్ తున్నీసా, దర్గా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కన్నా వెంకటేశ్వరరావు, విజయవాడ మత్స్య సహకార సంఘం అధ్యక్షులు మోపిదేవి ఏడుకొండలు, కూటమి నేతలు  బొమ్మసాని సుబ్బారావు, యేదుపాటి రామయ్య షేక్ ఖాదర్, గుడివాడ నరేంద్ర రాఘవ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here