తేదీ:-23/01/2025..
ఈ రోజు మన తెలుగు ప్రజల ఆశ కిరణం,తెలుగుదేశం పార్టీ భావి రధసారధి యువత భవితకు బంగారు బాట వేసందుకు నిరంతరం శ్రమిస్తున్న మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్య శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన పుట్టిన రోజు కార్యక్రమం
లో పార్టీ శ్రేణులు యువత తో కలిసి డాక్టరు ఉండవల్లి శ్రీదేవీ పాల్గొనరు.. అదే విధంగా శ్రీదేవీ మాట్లాడుతూ యువగళం పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకమైన తీరు లోకేష్ అందరి అభిమానాన్ని పొందారు..226 రోజులు పాటు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సామాన్య ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో స్వయంగా తెలుసుకున్నారు..ప్రజాక్షేమం, పార్టీ శ్రేయస్సు, రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా లోకేష్ ముందుకు సాగుతున్నారు అని శ్రీదేవీ అన్నారు..కుట్రరాజకీయాలకు అతీతంగా, ప్రజల ఆధరాభిమానాలే కొలమానంగా లోకేష్ పనిచేయడం రాష్ట్రానికే గర్వకారణం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తల కష్టం, పనితీరు గుర్తించిన ఘనత లోకేష్ దే. టీడీపీ సైన్యం కోటి సభ్యతలు దాటడం వెనుక లోకేశ్ ముఖ్య పాత్ర వహించారు .. మీరు నిండు నురేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అనీ మరి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించలని మనసారా కోరుకుంటూ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు నారా లోకేష్ ఈ కార్యక్రమం లో పాలిట్ బుర్యో సభ్యులు బక్కిని నర్సింహులు ,మరియు డాక్టర్ కమ్మేళ శ్రీధర్ ,మాజీ మంత్రి కాట్రగడ్డ ప్రసన్న పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మీ.
ఉండవల్లి శ్రీదేవీ
మాజీ శాసనసభ్యురాలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పోరేషన్ ఛైర్పర్సన్.