మంత్రి పార్థసారధి ని కలిసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, 17.06.2024.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు, నూజివీడు శాసనసభ్యులు కొలుసు పార్ధసారథి ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని కూడా కలిశారు. ఈ సందర్భంగా వారిరువురికి పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే కేపీ కి కూడా శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.