మంచిదన్నారు. మధ్యాహ్న భోజన బడి పథకం పై మార్చిన మెనూతో ముందుకెళ్లాలనుకోవడంతో దేశంలోనే ఏపీ బెస్ట్ రాష్ట్రంగా ఉంటుందన్నారు.
గుంటూరు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మెనూ మార్పుపై జిల్లాలో వర్క్ షాపు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాల్లో 5 మండలాల్లో అక్షయ పాత్ర ద్వారా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకానికి భోజనం అందిస్తున్నామన్నారు. స్థానికంగా దొరికే కూరగాయలతో మెనూ ను అందిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తినే అవకాశం ఉందన్నారు. కలర్ రైస్ ను పిల్లలు అంత ఇష్టంగా తినడం లేదన్నారు. అయితే మామూలు వైట్ రైస్ లో పప్పులో ఏదైనా స్థానికంగా దొరికే ఆకు కూరలతో కలుపుకుని అన్నం తినడానికి ఇష్ట పడుతున్నారన్నారు. స్థానికంగా దొరికే గోంగూర లాంటి పదార్థాలను పిల్లలు ఆహార పదార్థంలో తినేందుకు బాగా ఇష్టపడుతారన్నారు.
ఇంటర్మీడియేట్ విద్యా కమిషనర్ కృతికా శుక్లా మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంలో భాగంగా పిల్లలకు మంచి నాణ్యతతో, న్యూట్రిషన్ తో భోజనం అందించేందుకు ప్రభుత్వం చూస్తుందన్నారు. ఏ జిల్లాల్లో పిల్లలు ఎలా స్థానికంగా ఆహార పదార్థాలను తీసుకుంటున్నారో పరిశీలిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర మూడు ప్రాంతాల్లో స్థానికంగా దొరికే కూరగాయలకు మెనూలో ప్రాముఖ్యం ఇవ్వాల్సి ఉందన్నారు. ముఖ్యంగా న్యూట్రిషన్ ఫుడ్ అందించడం ముఖ్యమన్నారు. గర్ల్ చైల్డ్ లో రక్తహీనత ఉంటుందని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
సమగ్ర శిక్షా ఎస్పీడీ, మధ్యాహ్న భోజన పథక డైరెక్టర్ శ్రీ బిశ్రీనివాసరావు IAS., మాట్లాడుతూ…. మధ్యాహ్న భోజనం విద్యార్థుల డ్రాపౌట్ రేటు తగ్గించడానికి ఉపయోగపడుతుందన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాఠశాల విద్య సెక్రటరీ శ్రీ కోన శశిధర్ ప్రత్యేకంగా మాట్లాడారని అన్నారు. మధ్యాహ్న భోజనం మెనూ మార్పునకు సంబంధించి అక్షయ పాత్ర, ఫుడ్ ప్యూచర్ ఫౌండేషన్, న్యూట్రిషన్ సైంటిస్టుల సంస్థల సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుందన్నారు.
మధ్యాహ్నం భోజనం పథకం పై మార్చిన మెనూ కోసం ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి మధ్యాహ్నం భోజనం వండే ఆయాలతో స్టాల్స్ లో ఆహార పదార్థాలను ఉంచడం జరిగింది. అందులో విద్యార్థులకు అందించే మార్చిన మెనూ కోసం ఆహార పదార్ధాల నమూనా ను ప్రదర్శించారు. ఈ స్టాల్స్ ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆధ్యంతం పూర్తిగా పరిశీలించి, వాటి రుచి చూసి వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ డా కె. లక్ష్మి, యూనిసెఫ్ న్యూట్రిషయన్ ఫీల్డ్ ఆఫీసర్ (హైదరాబాదు) రేషా దేశాయ్, డొక్కా సీతమ్మ మునిమనవడు శ్రీ కామేశ్వరరావు, జాయింట్ ఫుడ్ కంట్రోలర్, (ఏపీ ఫుడ్ సేఫ్టీ) ఎన్. పూర్ణచంద్రరావు, మధ్యాహ్న భోజన పథక అడిషనల్ డైరెక్టర్ శ్రీమతి జి. గంగాభవానీ, సమగ్ర శిక్షా, పాఠశాల విద్యా శాఖ అధికారులు, ఆర్జేడీలు, డీఈవోలు, పాఠశాల కుక్ కమ్ హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.