*12-02-2025*
భారీ మెజార్టీతో ఆలపాటి గెలుపు ఖాయం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల ఎన్డీయే కూటమి నేతల ఆత్మీయ సమావేశం
విజయవాడ : ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా ఎన్డీయే కూటమి బలపరిచిన ఉమ్మడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు ఖాయమని, ఎన్టీఆర్ జిల్లాలో భారీ మెజార్టీ వస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.
ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల ఎన్డీయే కూటమి బలపరిచిన ఉమ్మడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాలనీలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో బుధవారం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల ఎన్డీయే కూటమి నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటు నమోదు చేయించుకున్న గ్రాడ్యుయేటర్ల ఓటర్ల మ్యాపింగ్ కార్యక్రమం చురుగ్గా సాగుతుందన్నారు. ఎన్డీయే కూటమి నేతలు ప్రతి 30 మంది ఓట ర్లకు ఒక పరిశీలకుడిని నియమించి మ్యాపింగ్ చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యతా ఓటును ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు వేసేలా క్షేత్రస్థాయిలో కూడా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పట్టభద్రులను కచ్చితంగా పోలింగ్ బూత్ కి తీసుకువచ్చి ఓటు వేయించే విధంగా కూటమి నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు. ఆలపాటి రాజా వంటి మేధావులు శాసనమండలిలో ఉండాలన్నారు. ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు ఈ ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ గ్రాడ్యుయేట్స్ ఓటర్లను చైతన్య చేస్తున్నారని చెప్పారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్ఛం అందించారు. కనపర్తి శ్రీనివాసరావు
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు , బోండా ఉమామహేశ్వరరావు ,తంగిరాల సౌమ్య, వసంత వెంకట కృష్ణ ప్రసాద్, కోలికపూడి శ్రీనివాసరావు , శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య , ఎమ్మెల్సీ అశోక్ బాబు , బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డురి శ్రీరామ్, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను ,
ఏపీ స్టేట్ మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి, ఎపి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర రావు, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శులు కనపర్తి శ్రీనివాసరావు, ఎమ్.ఎస్. బేగ్ లతో పాటు ఎన్టీఆర్ జిల్లా కృష్ణాజిల్లా ఎన్. డి. యే కూటమి నేతలు, నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు అబ్జర్వర్లు పాల్గొన్నారు