విజయవాడ నగరపాలక సంస్థ
11-03-2025
భవన నిర్మాణ సంబంధిత జీవోలపై సిబ్బందికి అవగాహన కార్యక్రమం
భవన నిర్మాణ సంబంధిత జీవోలపై సిబ్బందికి మంగళవారం సాయంత్రం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో అవగాహన కార్యక్రమం కల్పించారు విజయవాడ నగర పాలక సంస్థ సిటీ ప్లానర్ చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణాల సంబంధించిన జీవోలపై, సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు, బిల్డర్లు, వ్యాపారవేత్తలకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా కల్పించిన సౌకర్యాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ప్లాన్లను దరఖాస్తు చేసుకునే ప్రక్రియ వంటి విషయాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ రాజమహేంద్రవరం శ్రీనివాసులు, డిప్యూటీ సిటీ ప్లానర్ సుభాష్ చంద్రబోస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు రాంబాబు, మోహన్ బాబు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గిరి, లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ ఇంజనీర్లు ఆర్కిటెక్లు టౌన్ ప్లానింగ్ సిబ్బంది.