బోగవల్లి శ్రీధర్ ను పరామర్శించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి భోగవల్లి శ్రీధర్ హృద్రోగంతో బాధపడుతూ విజయవాడలోనీ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
పశ్చిమ శాసన సభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
భోగవల్లి శ్రీధర్ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే సుజనా ఆకాంక్షించారు.