బోగవల్లి శ్రీధర్ దశ దిన కర్మలో పాల్గొని నివాళులర్పించిన బీజేపీ శ్రేణులు,ఎన్డీఏ కూటమి నేతలు
భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా పనిచేస్తూ అకాల మరణం చెందిన బోగవల్లి శ్రీధర్ దశదిన కర్మ గురువారం మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ,ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎమ్మెల్యే పొలిటికల్ సెక్రటరీ నంబూరి నరసింహారావు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం ఎస్ బేగ్, బీజేపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ,అవ్వారు బుల్లబ్బాయి, పోతిన భేసు కంటేశ్వరుడు, పైలా సురేష్,బెవర శ్రీనివాస్ , బీ ఎస్ కే పట్నాయక్,బీజేపీ నేతలు ఎన్డీఏ కూటమి నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీధర్ కు శ్రద్ధాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.
వారి కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని భరోసానిచ్చారు.