Home Political news బొండా ఉమా మాట్లాడుతూ :-65 సంవత్సరాల పైబడి ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదవారు, వారి...

బొండా ఉమా మాట్లాడుతూ :-65 సంవత్సరాల పైబడి ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదవారు, వారి ఇళ్ళకు రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో

3
0

 12-2-2025

ధి:12-2-2025 బుధవారం ఉదయం 10:30″ గం లకు ” సెంట్రల్ నియోజకవర్గం లోని 24వ డివిజన్ గిరిపురం మరియు న్యూ గిరిపురం నందు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు పట్టాలమీద అవగాహనా కార్యక్రమం నిర్వహించారు

 ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ :-65 సంవత్సరాల పైబడి ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదవారు, వారి ఇళ్ళకు రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో

అనేక విధాలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని

ప్రధానంగా వారి కుటుంబంలో ఉంటున్న పిల్లల చదువులు, వివాహాలు జరిగే సందర్భంలో జాతీయ బ్యాంకుల్లో లోన్లు రాకపోవడం, వీరి అవసరం కోసం కొనుగోలు మరియు అమ్మకాలు జరిగే నేపథ్యంలో సరియైన ధర రాకపోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అని

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద వర్గాలకు శాశ్వత పరిష్కారంగా జీవితకాల సమస్యలు ఏమీ లేకుండా పరిష్కారం చేస్తామని ఇచ్చిన హామీ మేరకు, నివాస యోగమైన పట్టాలకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పామని దానికి నిదర్శనం గానే జీవో నెంబర్ 30 ను తీసుకొని వచ్చి 150 గజాల వరకు ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుందని

 అలాగే 151 నుండి 300 గజాలు నామమాత్రం చార్జీ లతో రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుందని, ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి పేదవారికి అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది అని అన్నారు

 ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జిల్లా కలెక్టర్ గl ఆదేశాలతో జీవో నెంబర్ 30 ప్రకారం MRO తో ఒక కమిటీని ఏర్పాటు చేసి, సచివాలయ సిబ్బందితో ఇంజుమ్మిరేషన్ చేపించి వారి పేరు, నివాసి స్థలాలు, ఎన్ని గజాలు సర్వేను చేసి వారి అందరికి శాశ్వతంగా లిస్ట్ ఇవ్వబడుతుంది అని

 గతంలో  1970 గురిపురం అనే ఏర్పడింది అని అక్కడ 30, 40 నుండి 50 గజాలు నివాసముండే ప్రాంతాలని ఈరోజుకి 2025 వారికి రిజిస్ట్రేషన్ల సదుపాయం ఏ ప్రభుత్వం కల్పించలేదని  తాను శాసనసభ్యులు అయినా మొదటి అసెంబ్లీ సమావేశాలలోనే శాసనసభలో మాట్లాడి తరువాత ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ని కూడా కలిశానని, తరువాత రెవెన్యూ సదస్సులు, రాష్ట్రస్థాయి సదస్సులు కూడా మాట్లాడి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేశానని

 మంత్రి అనగాని సత్యప్రసాద్ ని అలాగే అధికారి సిసోడియా ని కలిసి మాట్లాడి ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపానని దాని ఫలితమే జీవో నెంబర్ 30, అలాగే జీవో నెంబర్ 23 మరియు మరొక జీవో నెంబర్ 27ను కూడా తీసుకొని రావడం జరిగినదని వీటితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నివాస స్థలంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్లు చేయటం జరుగుతుందని అన్నారు

 శాశ్వత నివాసితులందరికీ ఉచిత రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుంది, దీని ద్వారా వేరే వారికి అమ్ముకోవడం కానీ  బ్యాంకు రుణాలు తీసుకోవడం కానీ వెసులుబాటుగా ఉంటుందని అన్నారు, వారి ఆరోగ్య పరిస్థితిలోనూ, పిల్లలకు చదువు నిమిత్తం, అవసరమైతే ఈ భూముల రిజిస్ట్రేషన్లు ఉపయోగపడుతుందని ఈ జీవాల ద్వారా పూర్తిగా హక్కులు వారికి అందించే విధంగా ఈ జీవోలను ప్రజలందరూ ఉపయోగించుకోవలసినదిగా, దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు సర్వేను చేపించి రిజిస్ట్రేషన్లకి చేపించేందుకు బాధ్యతను తీసుకుంటామని తెలిపారు

 ఇళ్ళ నివాసితులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తక్షణమే దరఖాస్తులు చేసుకోవలసిందిగా బొండా ఉమ తెలియజేసారు

 ఈ కార్యక్రమంలో గుడ్డేటి మురళి, గడ్డం రాజు, గాజుల బ్రదర్స్, మోత్రపు బెనర్జీ,అంకాలు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here