26-5-2025 ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు కి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ మహానాడుకు తరలిన – టీడీపీ కుటుంబ సభ్యుల 3 బస్ లను తెలుగుదేశం పార్టీ జెండాను మాజీ AMC డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్ జెండాను ఊపి లాంఛనంగా ప్రారంభించడం జరిగింది*ధి:26-5-2025 సోమవారం సాయంత్రం 7:00″గం లకు ” సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, MLA బొండా ఉమామహేశ్వర రావు ఆదేశాలతో కడపలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం నుండి భారీగా తరలివెళ్లడం జరిగినదిఈ సందర్బంగా:-తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు జోహార్ అన్న ఎన్టీఆర్, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం, వర్ధిల్లాలి బొండా ఉమ నాయకత్వం అంటూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నినాదాలు చేశారుతెలుగు జాతి ప్రజల ఆత్మగౌరవం కోసమే తెలుగుదేశం పార్టీ ఏర్పడిందన్నారు, అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీని అధికారంలోకి తెచ్చి తెలుగువారి ఖ్యాతిని నలుగు దిశల వ్యాప్తి చేసి భారతదేశంలోనే ఒక బలమైన శక్తిగా తెలుగుదేశం పార్టీని నిలిపారని, ఆ మహనీయుని తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ సమర్ధవంతంగా నడిపిస్తూ పార్టీని తిరుగులేని శక్తిగా నిలుపుతూ కార్యకర్తలకు కుటుంబంలోని తోబుట్టు లాగా యోగక్షేమాలు చూస్తూ నే పేద ప్రజల సంక్షేమానికి పునాదులు వేసి పేదల కనీస అవసరాలైన కూడు, గుడ్డ, నీడ కల్పించాలనే ప్రధాన ఆశయంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నాటి నుండి అన్న ఎన్టీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీని సీఎం చంద్రబాబునాయుడు నడిపిస్తూ పాలనలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారనివిజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో MLA బొండా ఉమ తిరుగు లేనటువంటి శక్తిగా తెలుగుదేశం పార్టీ నిలపడమే కాక, జిల్లాలోని రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకొని, నిత్యం ప్రజల అవసరాలను తెలుసుకొని, ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించవలసిన సంక్షేమ పథకాలను వారి వద్దకు తీసుకొని వెళ్లడంతో పాటు, నియోజకవర్గాన్ని ఇప్పటికే ₹200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత బొండా ఉమా దని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తన సొంత కుటుంబ సభ్యులలో భాగంగా చూస్తూ వారికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటున్నటువంటి బొండా ఉమ ఉమా ఇంకా ఉన్నతమైన స్థానాలకు వెళ్లాలని నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారురేపు 27,28,29 కడపలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి తరలివెళ్లేందుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లోని 21 డివిజన్ లనుంచి భారీగా తరలివెళ్తున్నారు అని తెలియజేసారు
