బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి
భారతీయ జనతాపార్టీ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యాలయము
23-01-2025/ గురువారం ఈ రోజు బిజెపి రాష్ట్ర కార్యాలయములో స్వాతంత్ర్య సమర వీరులలో అగ్రగణ్యుడు,అలుపెరుగని ఓటమి లేని పోరాట యోధుడు,నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128 వ జయంతి సందర్భంగా భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నూకల మధుకర్ జీ,బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ పటానికి పూల మాలలు వేసి ఆ మహనీయునికి ఘన నివాళుల అర్పించారు.
ఈ సందర్భంగా మధుకర్ జీ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ దివస్ గా జరుపుకుంటున్నామని చంద్రబోస్ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన తీరును ప్రతి ఒక్క యువత గుర్తు చేసుకోవాలి అని యువత వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు.అలాగే బిట్ర శివన్నారాయణ మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్రం కేవలం చంద్రబోసు పోరాటం వలనే వచ్చిందని,అజాద్ హిందు ఫౌజును స్థాపించి భారత దేశ యువతతో పాటు విదేశాల మద్దతు కూడగట్టి బ్రిటీష్ వారికి చుక్కలు చూపించారని ఈ సందర్బంగా ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో NTR జిల్లా BJP అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ,భోగవల్లి శ్రీదర్ ,గుడివాడ నరేంద్ర,BSK పట్నాయక్ ,వల్లూరిగంగాధర్,నడింపల్లి ప్రభుకుమార్ ,చిగురుపాటి లక్ష్మి,ఇమ్మిడిశెట్టి సుమతి ,స్వాతి,పాలడుగు సుభాషిని, యర్రాసునీత,శాంతి,యలశిల శ్రీనివాస్,యుగందర్ ,వీరబాబు,తదితరులు పాల్గొన్నారు.