బీజేపీలోకి భారీగా మైనారిటీలు
సుజనాకు దుర్బేసుల హుస్సేన్ మద్దతు
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దుర్బేసుల హుస్సేన్ నాయకత్వంలో భారీ సంఖ్యలో మైనారిటీలు బీజేపీ లో చేరారు. విజయవాడ పశ్చిమ నియోజక వర్గానికి చెందిన హుస్సేన్ కాంగ్రెస్ లో దశాబ్దాల కాలంగా కీలక పదవుల్లో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న హుస్సేన్ వెంట మైనారిటీ మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో సుజనా చౌదరి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సుజనా గెలుపునకు త్రికరణ శుద్ధిగా కృషి చేస్తామని హుస్సేన్ అన్నారు