బిజెవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు
ప్రధానమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
అమరావతి *ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో వేలకోట్లు కేటాయించిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, బాణాసంచా కాల్చి హోరెత్తించారు
ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర రావు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బిజెపి తో సాధ్యమన్నారు.
ఎన్ డి ఎ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు పెడుతుంద న్నారు .
బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టావంశీ మాట్లాడుతూ యువతకు బడ్జెట్ లో పెద్ద పీట వేశారన్నారు.
మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ మహిళలు కు ప్రధాన ప్రాధాన్యత ఇచ్చారన్నారు,దేశ సర్వతో ముఖాభివృద్దికి ఈ బడ్జెట్ సంకేతమని మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్,బిజెపి నేతలు మువ్వల వెంకట సుబ్బయ్య, పీయూష్ దేశాయ్, బిజెపి వైఎం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు