20-06-2024
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలను కలిసిన ఎంపి కేశినేని శివనాథ్ చిన్ని
విజయవాడ : బి.జె.పి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గురువారం పట్టణంలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. వీరిద్దరు కాసేపు రాష్ట్ర, కేంద్ర రాజకీయాల గురించి చర్చించుకున్నారు. అలాగే రాష్ట్రాభివృద్ది కోసం కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో సమిష్టిగా కృషి చేయాలని భావించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ తనయురాలిగా సమర్థత, సామర్ధ్యం గల నాయకురాలిగా అత్యంత ప్రజాదరణతో పురంధేశ్వరి రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారని కొనియాడారు.