విజయవాడ
బిజెపి కండువా కప్పుకున్న అమ్మ హాస్పిటల్ డాక్టర్లు దుర్గా శ్రీలక్ష్మి, పవన్ కుమార్ లు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎంఎల్ఏ సుజనా చౌదరి
మచ్చలేని పార్టీ కావడతో బిజెపిలో చేరాం – డాక్టర్ దంపతులు
ఎంపి, ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి
ఏపీ బడ్జెట్ ను పూర్తిగా పరిశీలించి కామెంట్ చేస్తాం
బిజెపి వాణి ఎప్పుడూ ప్రజా వాణి
సమస్యలపై స్పందించడం, ప్రజల మాట వినిపించడం బిజెపి విధానం
రాజకీయంలో మచ్చలేని పార్టీ బిజెపి అని చెప్పగలం
వేలెత్తి చూపలేని పార్టీగా మోదీ పాలనలో బిజెపి ఉంది
గతంలో స్కాముల ప్రభుత్వాలు చూసాం.. మోదీ నేతృత్వంలో స్కీముల ప్రభుత్వాం చూస్తున్నాం..
ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 52% ఓట్లు బిజెపికి వస్తాయని ఒక సర్వేలో తేలింది
బిజెపిలో చేరికలు కొనసాగుతాయి
సుజనా చౌదరి చెప్పినట్టు పశ్చిమ విజయవాడలో తగ్గిన 50వేల ఓట్లు కూడా బిజెపికి వస్తాయి
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాహిత బడ్జెట్
ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. స్వచ్ఛందంగా బిజెపిలో చేరిన డాక్టర్ దంపతులను అభినందించారు. నిస్వార్ధంగా ప్రజాసేవ అందిస్తున్న భారతీయ జనతా పార్టీలో మిగతా పార్టీల నాయకులు, కార్యకర్తలందరూ చేరేలా బిజెపి నేతలు ప్రోత్సహించాలన్నారు.