విజయవాడ అర్బన్
బాలికను పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్
నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో 7వ తరగతి చదువుచున్న బాలికపై బాబాయి లైంగిక దాడికి గురై విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స పొందుతూన్న బాలికను రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ శ్రీమతి రాయపాటి శైలజ పరామర్శించారు. బాలికను జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. సకాలంలో వైద్యం అందించాలని వైద్యా సిబ్బందికి సూచించారు. కేసు ఎంక్వయిరీని తక్షణమే చేపట్టాలని పోలీస్ సిబ్బంది కి సూచించారు. బాలికకు కౌన్సిలింగ్ ఇప్పించమని జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పీడీ కి సూచించారు. బాలిక పిన్ని మరియు అమ్మమ్మ తో సంఘటన గురించి అడిగి తీసులుకున్నారు. బాలిక డీఛార్జ్ అయినతరువాత బాలిక నిర్ణయం మేరకు హోమ్ లో పెట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం, నోడల్ ఆఫీసర్ సాయిగీత, డీసీపీవో యమ్ రాజేశ్వరరావు, OSC సిబ్బంది మరియు DCPU సిబ్బంది పాల్గొన్నారు.
![]()
