
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
కుటుంబ పెద్దను పోగొట్టుకొని తన ఇద్దరు కుమార్తెలతో జీవనం సాగిస్తున్న గుమ్మా వెంకటలక్ష్మి కుటుంబానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆర్థిక సాయం అందించారు.
40 వ డివిజన్ , బాలకోటయ్య వీధికి చెందిన గుమ్మా నాగేశ్వరరావు (50) వెల్డింగ్ వర్క్ చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు
అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 20 న మృతి చెందాడు..
కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కుటుంబానికి సాయం అందించాలని మాజీ కార్పొరేటర్ ఆలుగుండ్ల సుబ్బారెడ్డి ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లారు..
ఎమ్మెల్యే ఆదేశాలతో కార్యాలయ సిబ్బంది,40 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పీ వీ చిన సుబ్బయ్య తో కలిసి వారి నివాసానికి వెళ్లి రూ 5000 వేలను ఆర్థిక సాయం అందించారు.
ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే సుజనా చౌదరి కు కృతజ్ఞతలు తెలిపారు..
కూటమి నేతలు అడుసుమల్లి వెంకటేశ్వరరావు , మన్నెం నారాయణ రావు, సుజనా మిత్రా కోఆర్డినేటర్ తిరుపతి రెడ్డి, పాల్గొన్నారు..
![]()
