Home Political news బాదుడే బాదుడు పేరుతొ విద్యుత్ చార్జీలను పెంచి ప్రజల పై సుమారు 15 వేల కోట్ల...

బాదుడే బాదుడు పేరుతొ విద్యుత్ చార్జీలను పెంచి ప్రజల పై సుమారు 15 వేల కోట్ల రూపాయలను భారం మోపిన చంద్రబాబు – వెలంపల్లి శ్రీనివాసరావు

2
0

 విజయవాడ

27-12-2024

బాదుడే బాదుడు పేరుతొ విద్యుత్ చార్జీలను పెంచి ప్రజల పై సుమారు 15 వేల కోట్ల రూపాయలను భారం మోపిన చంద్రబాబు – వెలంపల్లి శ్రీనివాసరావు

విద్యుత్ చార్జీలను తగ్గించాలని ప్రజల యొక్క గొంతుని రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించే విధంగా విజయవాడ పశ్చిమలో వైయస్ ఆర్ సిపి పోరుబాట కార్యక్రమం – వెలంపల్లి శ్రీనివాసరావు

ప్రజలందరూ చంద్రబాబుని ముక్తకంఠంతో కండిస్తున్నారు – వెలంపల్లి శ్రీనివాసరావు

ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని ప్రజలను మభ్య పెట్టి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి చంద్రబాబు గద్దె ఎక్కాడు – వెలంపల్లి శ్రీనివాసరావు

అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్న ఏ ఒక్క హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు – వెలంపల్లి శ్రీనివాసరావు

 చంద్రబాబుని నమ్మి ఓటేసి తప్పు చేశామని ఆరు నెలలు కాకముందే రోడ్ల మీదకు వచ్చిన ప్రజలు – వెలంపల్లి శ్రీనివాసరావు

చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోరాటాలు చేస్తాం – వెలంపల్లి శ్రీనివాసరావు

చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజలకు మేలు చేసే విధంగా, సంక్షేమ పధకాలను అందించేవిధంగా, ప్రజల మీద బారంలేకుండా చూడాలని వైయస్ కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం – వెలంపల్లి శ్రీనివాసరావు

స్థానిక 43వ డివిజన్ నందు శుక్రవారం నాడు మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపు పై వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయన బాగ్యలక్ష్మి, వైసిపి కార్పొరేటర్లు నాయకులతో కలిసి ఊర్మిళా నగర్ లోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఘన నివాళులర్పించి అనంతరం ప్రజలతో, వైసిపి శ్రేణులతో కలిసి జోజినగర్ లోని రామరాజ్య నగర్ సబ్ స్టేషన్ వద్దకు ర్యాలీగా వెళ్లి విద్యుత్ అధికారికి కరెంట్ చార్జీలను తగ్గించవలసిందిగా వినతి పత్రం అందాచేసారు

ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరు విద్యుత్ చార్జీల పెంపు పై భారంగా బాధపడుతున్నారని, చంద్రబాబు ఎన్నికల ముందు కరెంట్ చార్జీలు పెంచనని అవసరమైతే వీలైనంత వరకు తగ్గిస్తానని తప్పుడు వాగ్దానాలతో ఈ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడని దుయ్యబట్టారు. బాదుడే బాదుడు పేరుతొ చంద్రబాబు ప్రజల పై సుమారు 15 వేల కోట్ల రూపాయలను విద్యుత్ చార్జీలను పెంచి ప్రజల పై భారం మోపి ప్రజలను బాధపెడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బాదుడే బాదుడుకి వ్యతిరేకంగా ప్రజల యొక్క గొంతును వైయస్ ఆర్ సిపి వినిపించే విధంగా 175 నియోజకవర్గాలలో విద్యుత శాఖ అధికారులకు వినతి పత్రం ఇచ్చి, చంద్రబాబు 15 వేల కోట్లు దోచుకుంటున్నారని దాని ఆపమని చెప్పే విధంగా వైయస్ ఆర్ సిపి పోరుబాట కార్యక్రమం చేపట్టడం జరిగిందని దానిలో భాగంగానే విజయవాడ పశ్చిమలో ఊర్మిళ నగర్ వైయస్ ఆర్ విగ్రహం వద్ద నుంచి జోజి నగర్ సబ్ స్టేషన్ వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్లి ప్రజల యొక్క గొంతుని రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించే విధంగా విద్యుత్ చార్జీలను తగ్గించాలని వైయస్ ఆర్ సిపి పోరుబాట కార్యక్రమం చెప్పటడం జరిగిందన్నారు. ప్రజలందరూ చంద్రబాబుని ముక్తకంఠంతో కండిస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ అన్ని ప్రజలను మభ్య పెట్టేవిధంగా తప్పుడు వాగ్దానాలు ఇచ్చి చంద్రబాబు గద్దె ఎక్కారని కానీ ప్రభుత్వంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్న ఏ ఒక్క హామీలను అమలు చేయలేదని, చదువుకునే పిల్లలకు అమ్మఒడి ఇవ్వలేదని, రైతులకు రైతు భరోసా ఇవ్వలేదని, అన్ని వర్గాల వారిని చంద్రబాబు మోసం చేసాడన్నారు. ఆ హామీలు నెరవేర్చే వరకు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోరాటాలు చేస్తామన్నారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థల ద్వారా ప్రజల ఇంటి వద్దకే అన్ని సంక్షేమ పధకాలు అందించేవారని అటువంటి పరిపాలనను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు, చంద్రబాబుని నమ్మి ఓటేసి తప్పు చేశామని ఆరు నెలలు కాకముందే ప్రజలందరూ రోడ్ల మీదకు వస్తున్నారని కూటమి ప్రభుత్వం ఎంత దిక్కుమాలిన ప్రభుత్వమో అర్ధమవుతుందన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజలకు మేలు చేసే విధంగా, ప్రజలకు సంక్షేమ పధకాలను అందించేవిధంగా, ప్రజల మీద బారంలేకుండా చూడాలని వైయస్ కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు బాపతి కోటిరెడ్డి, షేక్ రెహమాతున్నీసా, MD ఇర్ఫాన్, యరడ్ల ఆంజనేయ రెడ్డి, పడిగపాటి చైతన్య రెడ్డి నాయకులు బంక విజయ, షేక్ హయత్, మాజీ చైర్మన్లు తోలేటి శ్రీకాంత్, కర్నాటి రాంబాబు, మాజీ డైరెక్టర్ లు, పార్టీ జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు పొలిమెట్ల శరత్, విశ్వనాధ రవి, తనబుద్ది చంద్ర శేఖర్ రెడ్డి, షేక్ మస్తాన్, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here