బలిదాన్ దివస్” శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్బంగా వారి చిత్ర పటానికి నివాళులర్పించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
అనపర్తి SNR ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన బలిదాన్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించి శ్రీ శ్యామ్ ముఖర్జీ జూన్ 23 మెడికల్ డెత్ మరణానికి గల కారణాలను, దేశానికి చేసిన సేవలను గుర్తు చేసారు
అనంతరం అనపర్తి నియోజకవర్గం బీజేపీ విస్తృత స్థాయి సమావేశoలో మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటానని, అనపర్తిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని, దేవాలయాలను,రోడ్లను,వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ బీజేపి కన్వీనర్ & యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణంరాజు, గుంటూరు నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ తమనంపూడి రామకృష్ణారెడ్డి,బీజేపీ నాలుగు మండలాల అధ్యక్షులు గంగిరెడ్డి, పవన్ రెడ్డి, సత్యనారాయణ, సాయి రామ్, అనపర్తి నియోజకవర్గం బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.