Home public news ఫించ‌న్ల పింపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపి కేశినేని శివ‌నాథ్

ఫించ‌న్ల పింపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపి కేశినేని శివ‌నాథ్

3
0

 01-05-2025

ప్ర‌జా స‌మ‌స్య‌లు ష‌రిష్క‌రించ‌ట‌మే ఎన్డీయే ప్ర‌భుత్వం ముఖ్యోద్దేశ్యం ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

ఫించ‌న్ల పింపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపి కేశినేని శివ‌నాథ్

17వ‌, 18వ డివిజ‌న్ల‌లో ఎన్టీఆర్ భ‌రోసా ఫించ‌న్ల పింపిణీ కార్య‌క్ర‌మం

ఇంటింటికి వెళ్లి ల‌బ్ధిదారుల‌కు ఫించ‌న్ సొమ్ము అంద‌జేత

స‌బ్ వే కానీ అండ‌ర్ పాస్ నిర్మించే విధంగా కృషి

రాబోయే రెండు మూడు నెలల్లో కృష్ణ‌లంక‌లో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం

విజ‌య‌వాడ : ప్ర‌తిప‌క్షంలో వున్నప్పుడు స‌మ‌స్య‌ల‌పై ఏవిధంగా పోరాడామో…అధికారంలో వ‌చ్చిన త‌ర్వాత ఆ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కృషి చేస్తున్నాము. ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌టం ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వ ముఖ్య ఉద్దేశ్యమ‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు. మేడే సంద‌ర్భంగా కార్మిక సోద‌రులంద‌రికీ మేడే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 

తూర్పు నియోజ‌క‌వ‌ర్గం రాణి గారితోట‌లో 17వ‌, 18వ డివిజ‌న్స్ తో ఎన్టీఆర్ భ‌రోసా ఫించ‌న్ పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు ఫించ‌న్ సొమ్ము రూ.4 వేల రూపాయులు అంద‌జేశారు. ప్ర‌తి నెల ఒక‌టో తారీఖు ఫించ‌న్ సొమ్ము మొత్తం అందుతుందా లేదా అనే విష‌యం అడిగి తెలుసుకున్నారు. 

ఈ సంద‌ర్భంగా మీడియాతో ఎంపి కేశినేని మాట్లాడుతూ ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ది కార్య‌క్ర‌మాల్లో భాగంగా కృష్ణ‌లంక ప్రాంతంలోని డ్రైనేజీలు, రోడ్లు, పార్కులు, స్కూల్ గ్రౌండ్స్ ఆధునీక‌రించే విధంగా ప్ర‌ణాళిక‌లు రూపొందించిన‌ట్లు తెలిపారు. ఇటీవ‌ల వ‌ర‌దలు సంభ‌వించిన‌ప్పుడు వ‌ర‌ద నివార‌ణ‌కు వాల్వూలు ప‌నిచేయ‌లేదు. ఆ స‌మ‌స్య పై దృష్టి పెట్టిన‌ట్లు తెలిపారు. అలాగే రాణి గారి తోట ద‌గ్గ‌ర వున్న హైవే క్రాస్ చేయ‌టానికి ప్ర‌జ‌లు ప‌డుతున్న‌ ఇబ్బందిని తొల‌గించేందుకు నేష‌న‌ల్ హైవే అధారిటీతో క‌లిసి స‌బ్ వే కానీ అండ‌ర్ పాస్ నిర్మించే విధంగా కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. రాబోయే రెండు మూడు నెలల్లో ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ తో క‌లిసి ఈ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే విధంగా కృషి చేయనున్న‌ట్లు తెలిపారు. 

 దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధికంగా ఫించన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్ర‌మే అన్నారు. చంద్రబాబు ముఖ్య‌మంత్రిగా అధికారంలోకి వచ్చిన వెంటనే విడతల వారీగా కాకుండా ఒకేసారి వెయ్యి రూపాయాలు పెంచి ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని కొనియాడారు. జగన్ కు వెయ్యి రూపాయలు పెంచడానికి విడతల వారీగా ఐదేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. ప్ర‌తి నెల ఒక‌టో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావార‌ణం నెల‌కొంటుంద‌న్నారు. 

ప్ర‌జ‌ల ఏ న‌మ్మ‌కంతో అయితే చంద్ర‌బాబు నాయుడును ముఖ్య‌మంత్రిగా గెలిపించుకున్నారో ఆ న‌మ్మ‌కాన్నినిల‌బ‌ట్టే విధంగా సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టి కే దీపం ప‌థ‌కం కింద ఉచితంగా గ్యాస్ సిలిండ‌ర్లు, ఫించ‌న్ల పెంపు, అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించ‌టం జ‌రిగింది. అలాగే ప్ర‌తి ఇంట్లో చ‌దువుకునే పిల్ల‌లంద‌రికీ ఒక్కొక్క‌రికి రూ.15 వేల చొప్పున ఇచ్చే త‌ల్లివంద‌నం ప‌థ‌కం మే నెలాఖ‌రు నుంచి, మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కం జూలై నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని వివ‌రించారు. 

ఈ కార్యక్రమం లో 18వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు వేముల దుర్గారావు, 17వ డివిజన్ పార్టీ అధ్యక్షురాలు రాయి రంగమ్మ,18వ డివిజన్ సెక్రటరీ తలపాటి ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పి. వెంకటనారాయణ,కమ్యూనిటీ ఆర్గనైజర్ కె. నాగలక్ష్మి, మాజీ కార్పొరేటర్ సిద్దెం నాగేంద్ర రెడ్డి, సీనియర్ నాయకులు పగడాల వెంకటేశ్వర రెడ్డి, బూత్ కన్వీనర్లు అంబటి కాశీ, వేజర్ల కాశీ,వేల్పుల విజయ, కొప్పొటి శ్రీనివాసరావు లతోపాటు ఎన్. డి. యే కూటమి స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here