Home Political news ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ...

ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఎడ్ల పూటీ లాగుడు పోటీలు ప్రారంభోత్స‌వానికి

2
0

 28-02-2025

ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

ఎడ్ల పూటీ లాగుడు పోటీలు ప్రారంభోత్స‌వానికి ముఖ్యఅతిథిగా హాజ‌రు

సంగ‌మేశ్వ‌ర స్వామిను ద‌ర్శించుకున్న ఎంపి కేశినేని, ఎమ్మెల్యేలు శ్రీరాం రాజ‌గోపాల్, వెనిగండ్ల‌రాము

నందిగామ మండ‌లం : ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జ‌లు సంతోషంగా పండుగులు జ‌రుపుకుంటున్నారు. గ్రామాల్లో మిగిలిన ప్రాచీన సంస్కృతి సంప్ర‌దాయాల‌ను ప్ర‌తి ఒక్క‌రు కాపాడాలి. ఇందుకోసం కూట‌మి ప్ర‌భుత్వం అండ‌గా వుంటుంద‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం నందిగామ మండ‌లం దాములూరు కూడ‌లి గ్రామంలోని సంగమేశ్వ‌ర స్వామి తిరునాళ్ల సంద‌ర్భంగా ఆల‌య మైదానంలో ఏర్పాటు చేసిన ఎడ్ల పూటీ లాగుడు పోటీల ప్రారంభోత్స‌వానికి ఎంపి కేశినేని శివ‌నాథ్ ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యేలు శ్రీరాం రాజ‌గోపాల్ , వెనిగండ్ల రాము, టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం ర‌ఘురామ్ తో క‌లిసి హాజ‌రైయ్యారు. 

ముందుగా వీరంతా సంగ‌మేశ్వ‌ర స్వామిని దర్శించుకుని తీర్ధ‌ప్ర‌సాదాలు అందుకున్నారు. అనంతరం శ్రీ కూడలి సంగమేశ్వ‌ర స్వామి వారి దేవాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పూటీ లాగుడు పోటీలను ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్య‌క్షుడు తో క‌లిసి కొబ్బ‌రి కాయలు కొట్టి ప్రారంభించారు. ఎడ్ల పూటీ లాగు పోటీల‌ను ఆస‌క్తిగా తిల‌కించ‌ట‌మే కాకుండా బ‌రి మొత్తం తిరిగి భ‌క్తుల‌కు అభివాదం చేస్తూ ఉత్స‌హ‌ప‌ర్చారు. అలాగే ఎంపి కేశినేని శివ‌నాథ్ బాణా క‌ర్ర చేత బ‌ట్టి, ఎమ్మెల్యే రాజ గోపాల్ తాత‌య్య‌, జిల్లా అధ్యక్షుడు చ‌ర్నాకోలు ప‌ట్టుకొని ఎడ్ల బండి ఎక్కి సంద‌డి చేశారు

అనంత‌రం ఎంపి కేశినేని శివ‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ వంద‌ల ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన సంగమేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకోవ‌టం తన అదృష్టంగా భావిస్తున్న‌ట్లు తెలిపారు. ఆ భ‌గ‌వంతుడి ఆశీస్సుల వ‌ల్ల ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో రాష్ట్రం అభివృద్ది దిశ‌గా ప‌య‌నిస్తుంద‌న్నారు. ప్ర‌జ‌ల సంతోష స్థాయిలు పెంచేందుకు ఎన్డీయే కూట‌మి కృషి చేస్తుంద‌న్నారు. జీవి రెడ్డి త‌మ పార్టీలోని వ్య‌క్తేన‌ని పార్టీ విడి బ‌య‌ట‌కు వెళ్ల‌లేద‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా బ‌దులిచ్చారు. 

ఈ కార్య‌క్ర‌మంలో తెలుగు రైతు అధికార ప్రతినిధి కొటారు సత్యనారాయణ ప్రసాద్ , నందిగామ మండల పార్టీ ప్రెసిడెంట్ వీరంకి వీరస్వామి, నందిగామ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తోట నాగమల్లేశ్వరరావు,, నందిగామ మండల ఎక్స్ ఎంపీపీ మన్నె కళావతి, తెలుగు యువత మండల అధ్యక్షుడు మన్నేపల్లి వినయ్, దా ములూరు గ్రామ సర్పంచ్ గాజుల రామారావు, సంగమేశ్వర గుడి చైర్మన్ గింజపల్లి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు మువ్వా వీరయ్య, నాయకులు చార్ల తులసీరావు, సిద్దు శివ, చెరుకూరు హైమారావు, కొత్తపల్లి బ్రహ్మం, వెంకట నరసయ్య, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు కోవెలమూడి వెంకటేశ్వరరావు ల‌తోపాటు ఎన్డీయే కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here