:-13-12-2024
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే NDA ప్రభుత్వ ధ్యేయం..
*నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ప్రజలు సైతం తన వెంట ఉన్నంతకాలం తాను సుపరిపాలన సాగిస్తాను – MLA బొండా ఉమ*
ధి:13-12-2024 శుక్రవారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయనిది నిరుపేదలకు అత్యవసర సమయాల్లో ఆసరాగా నిలుస్తోంది అని నియోజకవర్గం లోని 62వడివిజన్ ప్రకాష్ నగర్ కు చెందిన లబ్ధి దారుడు రావిపాటి.శివ కి ₹54046 యాభై నలుగువేల నలభై ఆరు రూపాయల CMRF చెక్కును ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అందజేశారు…
ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:-తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సారాద్యంలో సాగిస్తున్న ప్రజా ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ పథకాలాన్ని పేదలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది…
అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ముఖ్యమంత్రి సహాయ నిధిని తిరిగి అభాగ్యుల జీవితాల్లో కాంతిరేఖగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు దే అని..
ఆరోగ్య సమస్యలు, ఖరీదైన వైద్య సేవల అవసరం పడి ఖర్చు పెట్టుకునే స్థోమతలో లేని వారికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుంది అని, ఈ సాయంతో బాధిత కుటుంబాలకు సాంత్వన చేకూరుతుందని, అయిదేళ్ల వైకాపా పాలనలో ఇచ్చిన చెక్కులు కూడా చెల్లుతాయో చెల్లవో అన్న దుస్థితి నుంచి నేడు ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ని అడిగిన వెంటనే ఆపన్నహస్తం అందేలా చర్యలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని బొండా ఉమ తెలపటం జరిగింది.
ఈ కార్యక్రమంలో:- డివిజన్ ఇంచార్జ్ పైడి శ్రీను, డివిజన్ అధ్యక్షులు తొట్టెంపూడి ఉదయ్ శంకర్, బుల్లెద్దుల రవిచంద్ర,అరుమళ్ళ గోపిరెడ్డి, కేబుల్ రాజా, జాటాదర్, సుధాకర్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…