Home Political news ప్రభుత్వ అభివృద్ధి పనులతో పల్లెల్లో పండగే.మంత్రివర్యులు కొలుసు పార్థసారథి

ప్రభుత్వ అభివృద్ధి పనులతో పల్లెల్లో పండగే.మంత్రివర్యులు కొలుసు పార్థసారథి

4
0

 *నందిగామ, జనవరి 23, 2025*

ప్రభుత్వ అభివృద్ధి పనులతో పల్లెల్లో పండగే.

– రాష్ట్రం అన్ని రంగాల్లోనూ సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి

– రాష్ట్ర గృహ నిర్మాణం; సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి

కూటమి ప్రభుత్వ అభివృద్ధి పనులతో పల్లెల్లో పండగ వాతావరణం నెలకొందని.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణం; సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి అన్నారు.

గురువారం నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం, గుడిమెట్ల గ్రామ పంచాయతీ పరిధిలో రూ. 51 లక్షలతో పూర్తిచేసిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర గృహ నిర్మాణం; సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి.. నందిగామ శాసన సభ్యులు తంగిరాల సౌమ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ప్రారంభించారు. తొలుత గుడిమెట్ల శివారు లక్ష్మీపురంలో హౌసింగ్ కాలనీ వరకు జిల్లా ప్రజాపరిషత్ నిధులు రూ. 15 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. అనంతరం మంత్రివర్యులు పలు సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు  ముఖ్యమంత్రి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోందని వివరించారు.  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువ నేత లోకేష్ రాత్రనక పగలనకా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. పల్లెల్లో రహదారులు, డ్రైనేజీ తదితర వ్యవస్థలను ఆధునికీకరించడం వల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఒక పద్ధతి ప్రకారం, సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై నమ్మకంతో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. గూగుల్, టీసీఎస్, రిలయెన్స్ వంటి పెద్ద సంస్థలతో చేసిన చర్చలు ఫలిస్తున్నాయని మంత్రి పార్థసారథి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here