ప్రధాని మోడీకి సాదర స్వాగతం పలికిన యార్లగడ్డ
గన్నవరం :
ప్రపంచ దేశాధినేతల మన్ననలు పొందిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి గన్నవరం విమానాశ్రయంలో ప్రభుత్వ విప్,గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి వచ్చేందుకు శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సాదర స్వాగతం పలికారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈ సందర్భంగా యార్లగడ్డ కొద్దిసేపు ముచ్చటించి గన్నవరం నియోజకవర్గ సమస్యలను ఆయనకు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వాటి పరిష్కారాన్ని కృషి చేస్తానని యార్లగడ్డకు హామీ ఇచ్చారు. అనంతరం ప్రధాని ఇక్కడ నుంచి ప్రత్యేక హోదాలో అమరావతి బయలుదేరి వెళ్లారు. సాయంత్రం తిరిగి ప్రయాణంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వీడ్కోలు పలికారు. అనంతరం ప్రధాని మోడీ వాయుసేన ప్రత్యేక విమానంలో న్యూ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.