ప్రజలకు ఎటువంటి సమస్య తలెత్తనివ్వకూడదు

0
0

విజయవాడ నగరపాలక సంస్థ

04-08-2025

ప్రజలకు ఎటువంటి సమస్య తలెత్తనివ్వకూడదు

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు.

ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 17 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 7, ఇంజనీరింగ్ 3, రెవిన్యూ 1, ఎస్టేట్ 4, హౌసింగ్ 2 మొత్తం కలిపి 17 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు.

ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానెర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జున రావు, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన, జాయింట్ డైరెక్టర్ అమృత్ డాక్టర్ లత, పర్యవేక్షణ ఇంజనీర్ పి. సత్యకుమారి, పి. సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్) చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ.శ్రీధర్, బయాలజిస్ట్ కామేశ్వరరావు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి.ఎస్.ఎస్ సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here