Home Political news పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు.

పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు.

4
0

 పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు.

ప్రాజెక్టు క్యాంప్ కార్యాలయం నుండి పోలవరం వ్యూ ప్రాంత పరిశీలన

 అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి నిమ్మల

 కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ వద్ద యంత్రాల పనితీరు పరిశీలన.

 పనులపై ప్రాజెక్టు సిఈ నరసింహమూర్తి నుండి వివరాలను తెలుసుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.

పోలవరం,జనవరి 23:పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను గురువారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారన్నారు. ఆ మేరకు అధికారులతో సమన్వయం చేసుకొని ప్రాజెక్ట్ నిర్మాణా లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందన్నారు. 2025 నాటికి 

41. 15 మీటర్లకు పునరావస

పనులు పూర్తి చేసేందుకు ఇటీవల వెయ్యి కోట్లు నిర్వాసితులకు ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. రెండవ దశలో 45.72 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసేందుకు అవసర మైన పునరావాస పనులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామన్నారు. ఇందుకోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 2వ కట్టరు పని ప్రారంభిస్తుందని, మూడో కట్టర్ ఏప్రిల్ నాటికి వస్తుందన్నారు మూడు కట్టర్ల ద్వారా త్వరితగతిన డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

షెడ్యూల్ ప్రకారంగానే జనవరిలో డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించామని, గతంలో కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి ధ్వంసం చేశారాన్నారు .తుగ్లక్ పాలనతో పోలవరం పనులు ఎంతో వెనుక పడ్డాయి అన్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వల్ల మరో రూ. వెయ్యి కోట్ల ప్రభుత్వంపై భారం పడిందన్నారు. పోలవరం నిర్వాసితులను గత ప్రభుత్వం మోసం చేసిందన్నారు- నిర్వాసితులకు న్యాయం చేసి 2027 కి పోలవరం పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

 అంతకుముందు మంత్రి డయా ఫ్రమ్ వాల్ ప్రాంతంలో జరుగుతున్న పనులు పరిశీలించారు. యంత్రాల పనితీరు గురించి బావర్ కంపెనీ ప్రతినిధులు వివరించారు. బెంటో నైట్ మిశ్రమం ప్లాంటును పరిశీలించారు సమీపంలోని ప్రయోగశాలను సందర్శించి పానెల్ తవ్వకాల్లో వస్తున్న మెటీరియల్ పరిశీలించారు.

అనంతరం అదికారులతో సమావేశమైన రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు

మాట్లాడుతూ 2026 జూలై నాటికి నిర్వాసితులను తరలించడం తో పాటు , ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో మౌళిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.కాలనీల్లో దేవాలయాలు, శ్మశానాలు నిర్మించలేదనేది తన దృష్టికి వచ్చిందని, వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఆర్ అండ్ ఆర్ లో సిబ్బంది ఖాళీలు వెంటనే క్లియర్ చేయాలన్నారు. వచ్చే వారం పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనకు  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  వచ్చే అవకాశం ఉందని , అప్పటికి అన్నీ వివరాలు సిద్ధం చేయాలన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ బకాయులను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగానే ఉందన్నారు. ప్రతి నెల పునరావాస కాలనీల పనుల పురోగతిని కనబరచాలన్నారు. 

చింతూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ 

ప్రస్తుతం నిర్వశిత కాలనీలలో పనులు జరుగుతున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ట్రైకర్ చైర్మన్,బోరగం శ్రీనివాసులు, జలవనరుల శాఖ  సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్ట్ సిఈ కె.నరసింహ మూర్తి, ఎస్ఈ ఆర్ రామచంద్ర రావు, చింతూరు పిఓ, అపూర్వ భరత్, రంపచోడ వరం సబ్ కలెక్టర్ కలపశ్రీ ,కేఆర్ పురం ఐ టిడిఏ పిఓ, కే రాముల నాయక్,జంగారెడ్డి గూడెం ఆర్టీవో యం.వి.వెంకట రమణ,మెగా కంపెనీ అధికారులు, అంగర సతీష్,మురళీధర్,

చింతూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగమణి, ఈఈలు పి వెంకటరమణ, పి వెంకటేశ్వర రావు, ఏలూరు భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యం. ముక్కంటి, మాజీ ఏఎంసీ చైర్మన్, పి.రామారావు తదితరులు పాల్గొ న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here