పొగాకు రైతుల ఖాతాల్లోకి 48 గంటల్లోపే నగదు జమ

1
0

తేది:24-06-2025
విజయవాడ

పొగాకు రైతుల ఖాతాల్లోకి 48 గంటల్లోపే నగదు జమ

పొగాకు రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన నల్ల బర్లీ పొగాకు కు సంబంధించి 273 కోట్ల నగదు విడుదలకు రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం

తొలివిడత గా 100 కోట్ల నగదు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సీఎం చంద్రబాబు చొరవ, మంత్రి అచ్చెన్నాయుడు పనితనంతో రైతుల ఇంట అనందం

మంత్రి అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, గిద్దలూరు ఎమ్యెల్యే అశోక్ రెడ్డి

కూటమి ప్రభుత్వం లో రైతు రాజులా బ్రతకాలి

వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలను పెంచి కొనుగోలు వేగవంతం చేస్తున్నామని, రైతులకు 48 గంటల్లోపు నగదును జమ చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈరోజు జరిగినటువంటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పొగాకు కొనుగోలుకు సంబంధించి 273 కోట్ల రూపాయల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, తక్షణమే 100 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి అచ్చెన్న వెల్లడించారు. ఈ సందర్భంగా విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలుపై మార్క్ ఫెడ్ వ్యవసాయశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ,కొనుగోలు కేంద్రాల వద్ద ఏ ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నామని తెలిపారు. రైతుల నుంచి ప్రతి ఆకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సీఎం యాప్ లో రైతుల పేర్ల నమోదు వేగంగా చేపడుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ బర్లీ పోగాకు కొనుగోలు కొనసాగుతుందని, ఇప్పటివరకు బాపట్ల జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో రోజుకు 30 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు జరుగుతుందని, దీనిని 50 మెట్రిక్ టన్నులకు పెంచేలా అధికారులు సన్నద్ధం అవ్వాలని సూచించారు. సీఎం యాప్ లో ఇంకొల్లు, యద్దనపూడి, మార్టూరు కు చెందిన రైతులు సుమారు 3000 మంది రిజిస్టర్ అయ్యారని, వీరి కొరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని మ్యాపింగ్ చేయాలన్నారు. అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లోని పొగాకు రైతుల వివరాలను యాప్ లో రిజిస్టర్ చేయాలని అధికారులకు సూచించారు. యాప్ లో నమోదైన రైతుల దగ్గర నుండి పొగాకు కొనుగోలుకు తేదీలను కేటాయించడమైందన్నారు. రైతులు వారికి కేటాయించిన తేదీల్లో మాత్రమే పొగాకును కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు. ఒకవేళ వారు వారికి కేటాయించిన తేదీల్లో తీసుకురాని యడల వారికి మాన్యువల్ గా కొనుగోలుకు అవకాశం కల్పించాలని ఆయన మార్క్ ఫెడ్ అధికారులకు సూచించారు.

దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కొంటుంది

దేశంలోని మొట్టమొదటిసారిగా పొగాకును రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోలుకు ప్రభుత్వం 273.17 కోట్ల నిధులు మంజూరుకు అంగీకరించి, ఆ మొత్తంలో తక్షణమే 100 కోట్లు నిధులు విడుదల చేసిందని తెలిపారు. వచ్చే సంవత్సరం జిల్లాలో ఎక్కడా కూడా బ్లాక్ బర్లీ పొగాకు సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు ఆకర్షితులయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు ఆందోళన చెందకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలకు పొగాకు తీసుకువచ్చి నిరభ్యంతరంగా పొగాకును అమ్మవచ్చని పిలుపునిచ్చారు. రైతులకు త్వరితగతిన నగదును జమ చేసేందుకు కృషి చేస్తున్న మంత్రి అచ్చం నాయుడును ఎమ్మెల్యేలు ఏలూరు సాంబశివరావు అశోక్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, మ్యారీటైన్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య, పర్చూరు నియోజకవర్గ రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here