పేదల ఆరోగ్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్
ఎమ్మెల్యే సుజనా చౌదరి
పేదలు కార్పొరేట్ వైద్యం చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు సీఎం సహాయనిది కింద ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.
శనివారం తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీలను లబ్ధిదారు కుటుంబ సభ్యులకు అందజేశారు. పెజ్జోని పేటకు చెందిన పోతురాజు మణి కు వెన్నెముక శస్త్ర చికిత్సకు అవసరమైన రూ 1లక్ష విలువజేసే ఎల్వోసీ ను లబ్ధిదారునీ కుటుంబ సభ్యులకు అందజేసారు. ఎమ్మెల్యే చొరవతో సాయం అందడంతో వారు కృతజ్ఞతలు తెలిపారు.