Home Political news పేదలు, ఆపదలో ఉన్నవారు అండగా నిలబడటమే కూటమి ప్రభుత్వ ధ్యేయం – ముఖ్యమంత్రి సహాయ నిధి...

పేదలు, ఆపదలో ఉన్నవారు అండగా నిలబడటమే కూటమి ప్రభుత్వ ధ్యేయం – ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా‌ MLA బొండా ఉమ

2
0

 15-3-2025

పేదలు, ఆపదలో ఉన్నవారు అండగా నిలబడటమే కూటమి ప్రభుత్వ ధ్యేయం – ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా వేలాది మంది పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాం  MLA బొండా ఉమ

నియోజకవర్గం లో ఇప్పటి వరకు ₹7 కోట్లు CMRF సహాయం అందించాం – MLA బొండా ఉమ

ధి:15-3-2025 శనివారం సాయంత్రం 6:00″గం లకు ” సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి  సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ ప్రకాష్ నగర్ కు చెందిన  మొల్లి. నాగార్జున రెడ్డి  కి ₹1,32,000 రూపాయలు, కామవరపు దేవి గారికి ₹50,250 రూపాయలు మరియు T. మాధురి గారికి ₹25,000 వేల రూపాయల చెక్కులు అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం అయిన ఖర్చులను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సియంఆర్ఎఫ్ ద్వారా వచ్చిన చెక్కులను లబ్దిదారులకు పంపిణి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  బొండా ఉమామహేశ్వర రావు అందజేయడం జరిగింది

 ఈ సందర్భంగా బొండా  ఉమ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి సహాయనిధి మధ్యతరగతి ప్రజలకు ఒక వరం లాగా మారింది అని, లక్షల రూపాయలు ఖర్చుపెట్టి అత్యవసర పరిస్థితులలో వైద్యం చేపించుకున్న వారికి రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెల్లించడం జరుగుతుందని

 ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలో 7 కోట్ల రూపాయలకు పైబడి ముఖ్యమంత్రి సహాయనిధికి అర్జీలు పెట్టుకున్న వారి పత్రాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపి దగ్గరుండి చెక్కులు మంజూరు చేపించి ప్రతిరోజు సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో అర్జీ పెట్టుకున్న వారికి చెక్కులను అందిస్తున్నామని

 సామాన్య ప్రజలకు కూడా నిత్యం సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం అందుబాటులో ఉంటూ, ఏ సమస్య మీద వచ్చిన ఎటువంటి అర్జీ పెట్టుకున్న జవాబుదారీతనంగా పనిచేస్తుందని, నియోజకవర్గంలో ప్రజలు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న కార్యాలయాన్ని అభినందిస్తున్నారని

ప్రభుత్వపరంగా ప్రజలకు రావలసినటువంటి పథకాలు అన్నిటిని వారికి చేరువ చేస్తూనే, ప్రతినెలా ఒకటో తారీకు అందజేసేటువంటి మూడు వేల పెన్షన్లు నాలుగువేల రూపాయలకు పెంచడం, ఏడాదికి ఉచితంగా మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు అందించడం, వచ్చే మే నెల నుండి ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్లో చదువుకుంటే వారికి తల్లికి వందనం కింద 15 వేల రూపాయల వారి తల్లి ఎకౌంట్లోనే జమ చేయడం, అలాగే మహిళా సోదరీమణులకు ఏడాదికి 18 వేల రూపాయలు త్వరలోనే అందించనున్నామని, త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అందిస్తామని

 ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి హామీ నెరవేరుస్తామని, మేనిఫెస్టోలో లేని పథకాలను కూడా తీసుకొని వచ్చి ప్రజలకు మహిళలకు ఎంతో అండగా నిలబడుతుంది ప్రభుత్వం అని బొండా ఉమ తెలియజేశారు

 ఈ కార్యక్రమంలో:- ఘంటా కృషమోహన్, డివిజన్ ఇంచార్జి పైడి శ్రీను, బొల్లెద్దుల రవిచంద్ర, జూలకంటి సాయి, రౌతు మంగరాజు, బత్తుల కొండ, మాల్యాద్రి  తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here