పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్
ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ భవానిపురం లోనీ ఎన్డీయే కార్యాలయంలో శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితుడు షేక్ ఆదిల్ కు అందజేశారు.
41వ డివిజన్ దర్గా ప్రాంతానికి చెందిన ఆదిల్ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో కాలుకి సర్జరీ జరిగింది.
సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ 75,000 మంజూరు అయింది. అందుకు సంబంధించిన చెక్కును ప్రత్తిపాటి శ్రీధర్ మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్ తో కలిసి అందజేశారు.
నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుంది అన్నారు.