Home National పెరిగిన పసిడి ధరలు

పెరిగిన పసిడి ధరలు

2
0

 


గత వారం రోజులుగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న పుత్తడి ధరలు నేడు ఓ మోస్తరుగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 కేరెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 260 పెరిగి రూ. 60,619కి చేరుకుంది. 10 గ్రాముల స్వచ్ఛమైన (24 కేరెట్లు) బంగారం ధర రూ. 280 పెరిగి రూ. 66,619కి చేరుకుంది. వెండి ధర రికార్డు స్థాయిలో కిలో రూ. 80,100 చేరుకుంది. 


అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధరలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వేళ గత వారం రోజులుగా పుత్తడి ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 60 వేల వద్ద ఊగిసలాడింది. 22 కేరెట్ల ధర రూ. 55 వేలకు అటూఇటుగా రూ. 55 వేల వద్ద కదలాడింది. ఇప్పుడు మాత్రం స్వల్పంగా పుంజుకున్నాయి.


పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఈ ఉదయం 8 గంటలకు నమోదైనవి మాత్రమే. అంటే.. నిన్నటి క్లోజింగ్ ధరలు. వీటిలో  ఏ క్షణాన అయినా హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కాబట్టి కొనుగోలుదారులు అప్పటి రేట్లను తెలుసుకోవాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here