పెద్ద ఎత్తున నకిలీ బంగారు బిస్కట్స్ ను పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు

Spread the love

 పెద్ద ఎత్తున నకిలీ బంగారు బిస్కట్స్ ను పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు

నకిలీ బంగారు బిస్కట్స్ ను అసలు బంగారు బిస్కట్స్ నమ్మించి అమ్మడానికి ప్రయత్నిస్తున్న 3 సభ్యుల ముఠా ను SOT బాలానగర్ టీం మరియు జీడిమెట్ల పోలీసులు పట్టుకుని వారి వద్దనుండి 100 నకిలీ బంగారు బిస్కట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటిని కొనడానికి 27 లక్షలు సమకూర్చుకుని వచ్చిన వారు కూడా వారితో ఉన్నారు. 

అదే సమయంలో SOT పోలీసులు దాడి చేసి ముఠాను పట్టుకోడం తో కొనడానికి వచ్చిన బాధితులు పెద్ద మొత్తం లో డబ్బు పోకుండా రక్షించినదుకు SOT పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ముఠా సభ్యులు ఇంతకు ముందు కూడా ఇలాంటి నేరాలకు పాటుపడం జరిగింది.

యాశాల కామేశ్వర రావు, సరస్వతి నగర్ ఉప్పల్ వేముల పుల్లా రావు, గోరంట్ల, గుంటూరు బత్తుల సాంబశివరావు, నాగిరెడ్డి పాలెం బెల్లంకొండ గుంటూరు.

ఈ ముఠా ఇంకా ఎంతమందిని మోసం చేసింది అనే కోణం లో పోలీసు విచారిస్తున్నట్లు తెలుస్తుంది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *