Home Andhra Pradesh పెత్తందార్లుపైనే పోరాటం : జుపూడి పిల్లలు దర్జాగా బతికితే అదే అభివృద్ధి దేశానికే...

పెత్తందార్లుపైనే పోరాటం : జుపూడి పిల్లలు దర్జాగా బతికితే అదే అభివృద్ధి దేశానికే ఆదర్శం జగన్‌ పరిపాలన

4
0

 పెత్తందార్లుపైనే పోరాటం : జుపూడి

పిల్లలు దర్జాగా బతికితే అదే అభివృద్ధి

దేశానికే ఆదర్శం జగన్‌ పరిపాలన

రాష్ట్రంలో పేదలపై నిరంతరం కక్ష కడుతున్న పెత్తాందార్లుపైనే జగన్‌ పోరాడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌  రాష్ట్ర అధ్యక్షులు  జూపూడి ప్రభాకరరావుగారు అన్నారు. సంక్షేమమే లక్షంగా పాలన చేస్తున్న జగన్‌  గెలవకూడదని పెద్ద ఎత్తున పెత్తందార్లు  ప్రభుత్వంపైనా  దాడి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ దళితుల ఆత్మీయ సమావేశం ఆదివారం సాయంత్రం వన్‌టౌన్‌లోని మాడపాటి క్లబ్‌ ఆవరణలో నిర్వహించారు. పార్టీ ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షుడు బూదాల శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా హజరైన జుపూడి ప్రభాకరరావు మాట్లాడారు. పేదవర్గాలు ముఖ్యంగా దళితులు పిల్లలను ఇంకా అణగద్రొక్కాలని, వారికి మంచి ఇంగ్లీష్ మీడియం.చదువులు దూరం చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. అయితే ఆ శక్తులను ఎదుర్కొని అణగారిన వర్గాల పిల్లలను పైకి తీసుకువెళ్లాలని నిరంతరం జగన్‌మోహన్‌రెడ్డి పాటుపడుతున్నారని చెప్పారు. 

సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని విమర్శలు చేసిన నేతలు నేడు అవే పథకాలను పెడుతున్నారన్నారు.

  పేదల భవితను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టే ప్రతి పని అభివృద్ధే అని చెప్పారు.  రానున్న ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. విజయవాడ ఎంపీగా కేశినేని నానిని, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్ధి షేక్‌ ఆసిఫ్‌ ని  గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్ధి షేక్‌ ఆసిఫ్‌గారు మాట్లాడుతూ అణగారిన వర్గాలకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అడుగడుగున అండగా నిలిచిందన్నారు. విద్యా వైద్య రంగాల్లో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశంలో మిగిలిన రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. 

అట్టడుగు వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేసి అక్కున చేర్చుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని చెప్పారు.  పేద, మధ్య తరగతి వర్గాలు అధికంగా ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకునే పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దారన్నారు. ప్రపంచ స్థాయి చదువులను అందిస్తున్నారని చెప్పారు.

 చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించేందుకు అందరం కలిసి పోరాడాలని చెప్పారు.  జగన్‌మోహన్‌రెడ్డిని 

మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవటానికి సమిష్టిగా పాటుపడదామన్నారు. తాను అందరికీ అండగా ఉంటానని వివరించారు.

 లిడ్‌క్యాప్‌ ఛైర్మన్‌ కాకుమాను రాజశేఖర్‌ మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేవలం సంక్షేమంలోనే కాకుండా అభివృద్ధిలోనూ పరుగులు తీయించిన సమర్ధవంతమైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలన అంతా మోసాలమయమన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మీ, కార్పొరేటర్‌ శీరంశెట్టి పూర్ణ,  వైఎస్సార్‌ సీపీ నేతలు పోతిన మహేష్‌. కేశినేనిశ్వేత,కాలే పుల్లారావు.,దాసరిసువర్ణరాజుదాసీజయప్రకాష్‌కెనడీ.తోకల శ్యామ్‌గ,గడ్డంబాలరాజుచందా కిరణ్.బండి రాజ్ కుమార్.కామల్లి జోజి.ఇంద్ర. వరకాల జోషి. గౌడి పేరు సుధీర్. జమ్మలమూడి మార్క్. చేపూరి శీను. దొడ్ల సురేష్. దుర్గారావు. నాగరాజు. ఎద్దు సురేష్. జంగమానంద్. లాజర్. తంగిరాల ప్రమీల. పూనూరు జార్జ్. జోసఫ్ శివమణి. పచ్చిగల రమేష్. రామారావు. తంగిరాలకు కృప. బోయిల రాజేష్. మేదర సురేష్.ఎర్ర జొన్న విజయలక్ష్మి. రుద్రపాటి స్రవంతి. సుజాత దాస్. మట్టి రాము. దొడ్ల నీలిమ.  సురేంద్ర పసి.తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here