Home Political news పెట్టుబడులకు ఏపీ భేష్ వివిధ దేశాల ప్రతినిధులకు ఆహ్వానం పలికిన మంత్రి కందుల దుర్గేష్

పెట్టుబడులకు ఏపీ భేష్ వివిధ దేశాల ప్రతినిధులకు ఆహ్వానం పలికిన మంత్రి కందుల దుర్గేష్

2
0

 తేది:06.03.2025

అమరావతి

పెట్టుబడులకు ఏపీ భేష్

వివిధ దేశాల ప్రతినిధులకు ఆహ్వానం పలికిన మంత్రి కందుల దుర్గేష్

ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టాలని ఐటీబీ బెర్లిన్ -2025 సదస్సులో కోరిన మంత్రి దుర్గేష్

ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ

పెట్టుబడులకు ఇదే సరైన సమయమని తెలిపి నూతన ఆవిష్కరణలను పారిశ్రామికవేత్తలకు స్పష్టంగా వివరించిన మంత్రి దుర్గేష్

నూతన పర్యాటక పాలసీ, రాష్ట్ర పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారాన్ని తెలిపే పుస్తకాలను విదేశీ ప్రతినిధులకు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్

మూడో రోజు జర్మనీ పర్యటనలో బిజీ బిజీగా మంత్రి దుర్గేష్ బృందం

ఏపీ పర్యాటకం పెట్టుబడులకు అనుకూలమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జర్మనీ పర్యటనలో వెల్లడించారు. భారతదేశంలో మరే రాష్ట్రానికి లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో జల, రోడ్డు,వాయు రవాణా సౌకర్యాలతో పాటు అందమైన సహజ సిద్ధ ప్రకృతి ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి దుర్గేష్ అన్నారు.మూడో రోజు జర్మనీ పర్యటనలో భాగంగా గురువారం బెర్లిన్ సదస్సులో ఏర్పాటు చేసిన ఏపీ స్టాల్ వద్ద మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట వివిధ దేశాల ప్రతినిధులకు రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. నూతన పర్యాటక పాలసీ, రాష్ట్ర పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారాన్ని తెలిపే పుస్తకాలను విదేశీ ప్రతినిధులకు పంపిణీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో మడ అడవులు, సుదీర్ఘ సముద్ర తీరం, చారిత్రాత్మక ప్రదేశాలు, కోటలు, దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, చల్లని ప్రదేశాలు, సజీవ నదులు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ప్రఖ్యాతి పొందిన బౌద్దారామాలు సహా రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయని మంత్రి దుర్గేష్ పారిశ్రామికవేత్తలకు తెలిపారు. అంతేగాక సంస్కృతీ సాంప్రదాయాలకు తమ ప్రాంతంలో పెద్దపీట వేస్తామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో లగ్జరీ రిసార్ట్స్, వెల్ నెస్ సెంటర్స్, బహుళ అంతస్తు హోటళ్లు, విభిన్న పర్యాటకానికి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులకు పెద్దపీట వేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఈ క్రమంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించామని చెబుతూ నూతన పర్యాటక పాలసీ విధి విధానాలు, ఇన్వెస్టర్లకు అందించే రాయితీల వివరాలు వెల్లడించి ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆహ్వానించారు. పెట్టుబడులకు ఇదే సరైన సమయమని తమ ప్రభుత్వంతో భాగస్వామ్యమై ముందుకు వెళ్దామని కోరారు.ఇన్వెస్టర్లకు అన్ని విధాల అనువైన వాతావరణం ఏపీలో ఉందన్నారు.ఏపీలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here