విజయవాడ తేది:27.1.2025*
పీఎం సూర్యఘర్ ద్వారా 1లక్ష 10 వేల మందికి రుణాల లక్ష్యం
రణాల లక్ష్య సాదనకు బ్యాకర్లు కృషి చేయాలి
రుణాల మంజూరులో వెండర్లు, బ్యాంకర్లకు మధ్య సమన్వయం అవసరం.
ఇంధన రంగంలో స్వయం సమృద్ధిలో బ్యాకర్ల భాగస్వామ్యం అవసరం
సమిష్టి భాగస్వామ్యంతో సౌరశక్తి వినియోగంలో అగ్రగామిగా నిలుపుదాం
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.
పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ ప్యానెల్ కనెక్షలను ఏర్పాటు చేసేందుకు 1 లక్ష 10 వేల మంది లబ్దిదారులకు రుణాలను మంజూరు చేయాలన్న లక్ష్యాలను పూర్తి చేసేందుకు బ్యాకర్లు కృషి చేయాలని, రుణాల మంజూరులో వెండర్స్ బ్యాంకర్స్ మధ్య సమన్వయం అవసరమని, సమిష్టి కృషితో లక్ష్యాలను సాధించి ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో బ్యాకర్ల భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు.
సూర్యఘర్ పథకం కింద లబ్దిదారులకు రుణాలు మంజూరు పై సోమవారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యఘర్ పథకం ద్వారా జిల్లాలో 2 లక్షల ఇళ్ళకు సోలార్ విద్యుత్ ప్యానెల్ను అమర్చి జిల్లాను అగ్ర గామిగా నిలపాలనే లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఇందులో 1లక్ష 10 వేల మంది లబ్దిదారులకు బ్యాంకుల నుండి రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్థారించామన్నారు. ఇప్పటివరకు 787 మంది లబ్దిదారులు రుణాల కొరకు ధరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. 651 మంది లబ్దిదారులు 10 శాతం బాగస్వామ్యాన్ని చెల్లించడం జరిగిందన్నారు. లబ్దిదారులు ఇంటి కప్పుపై ప్రభుత్వ రాయితీతో పాటు అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకొని ఉచితంగా విద్యుత్ను వినియోగించుకుని ప్రజలకు కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సూర్యఘర్ పథకం అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాయన్నారు. లబ్దిదారులు రూ. 2 లక్షల విలువైన 3 కేడబ్ల్యూ సోలార్ ప్యానెల్ను రూ. 78 వేల ప్రభుత్వ రాయితీతో ఇంటి కప్పుపై ప్యానెల్స్ను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుందన్నారు. ప్రభుత్వ రాయితీ మినహా మిగిలిన సొమ్మును బ్యాంకర్లు రుణంగా మంజూరు చేయవలసి ఉంటుందన్నారు. కేటాయించిన లక్ష్యాల సాదనలో వెండర్లకు బ్యాంకర్లకు మధ్య సమన్వయం అవసరమన్నారు. బ్యాంకర్లు కాలయాపన చేయకుండా స్వీకరించిన ధరఖాస్తులను పరిశీలించి తక్షణమే రుణాలను మంజూరు చేయాలన్నారు. లబ్దిదారులకు రుణాలు మంజూరు చేసిన నివేధికల వివరాలను ప్రతి రోజు సమర్పించాలని ఆయన అన్నారు. పథకం ద్వారా జిల్లాలో రెండు లక్షల కనెక్షన్లను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఇప్పటివరకు దాదాపు 65 వేల మంది లబ్దిదారులు ప్యానెల్ను పొందేందుకు పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. స్వయం సహాయక సంఘ మహిళలు కూడా పెద్దఎత్తున రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారన్నారు. సౌర శక్తి ద్వారా కాలుష్యం లేని పర్యావరణ హిత ఇంధనాన్ని పొందొవచ్చునని, ధరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు అవసరమైన రుణాలను తక్షణమే మంజూరు చేసి పథకం అమల్లో జిల్లాను అగ్రగామిగా నిలపడంలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
సమావేశంలో ఎల్డియం కె. ప్రియాంక, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, కెడిసిసి బ్యాంక్ ఎజియం వాసవి కుమారి, బ్యాంక్ ఆప్ బరోడ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, కెనర బ్యాంక్, ఇండియన్ ఒవర్ సీస్ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకుల అధికారులు, సెవెన్ రేస్ నెట్ మ్యాటరింగ్, విజేత సోలార్ మార్కెటింగ్ ఎజెన్సీ, సూర్య పవర్ ట్రీ, ఆల్ఫా సోలార్ ఇంజనీర్స్, ధక్షిణ్ సోలార్ పవర్, శ్రీ లక్ష్మీ మారుతి ఇంజనీరింగ్, తదితర సోలార్ ప్యానెల్ పంపిణీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.