Home Political news పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి

పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి

3
0

 విజయవాడ నగరపాలక సంస్థ

27-11-2024

పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి

*

*వ్యర్థ సేకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్లను  పెంచండి*

*విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు*

 నగరంలో పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండకుండా చూసుకోవాలని,ఏర్పాటు చేసిన  ట్రాక్టర్లను  పెంచి వ్యర్ధాలను సేకరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా సత్యనారాయణపురం, సింగ్ నగర్, ఎక్సెల్ ప్లాంట్, బీసెంట్ రోడ్, పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య  నిర్వహణ పరిశీలించారు. 

 ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ  నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా  చూసుకోవాలని, వ్యర్ధల సేకరణకు వచ్చే ఆటో డ్రైవర్ల స్ట్రైక్ ఉన్నప్పటికీ నగరంలో పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి వెలితి లేకుండా చూసుకోవాలని, ఇప్పటికే పలు చోట్ల ట్రాక్టర్ల సహాయంతో వ్యర్ధాలను సేకరిస్తున్నప్పటికీ,  వ్యర్థ సేకరణ అవసరాలకు అనుగుణంగా మరిన్ని ట్రాక్టర్లను పెంచి పారిశుద్ధ్య నిర్వహణలో  ఎటువంటి లోపం లేకుండా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

 ఈ పర్యటనలో  చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్చార్జ్ డాక్టర్ సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెహికల్ డిపో ఇన్చార్జ్ యేసు పాదం పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here